Akhanda 2: ‘అఖండ 2’ మూవీ పూర్తి కథ లీక్..ఈసారి బోయపాటి కొట్టే దెబ్బకు పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే!

2001 వ సంవత్సరం లో విడుదలైన 'నరసింహ నాయుడు' చిత్రం తర్వాత బాలయ్య కెరీర్ లో సింహా , లెజెండ్ వంటి చిత్రాలు మాత్రమే పూర్తి స్థాయి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. కానీ అఖండ తర్వాత బాలయ్య చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి.

Written By: Vicky, Updated On : October 16, 2024 2:58 pm

Akhanda 2

Follow us on

Akhanda 2: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన కెరీర్ లో ‘అఖండ’ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా తర్వాత బాలయ్య మైండ్ సెట్ మారిపోయింది. కుర్ర డైరెక్టర్స్ తో పని చేస్తూ వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని కెరీర్ లో ఎప్పుడూ చూడనంత పీక్ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత, బోయపాటి శ్రీను బాలయ్య బాబు తో చేసిన చిత్రమిది. ఈ సినిమాకి ముందు బాలయ్య బాబు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ ఉన్నాడు. ఇక ఆయన కెరీర్ ముగిసిపోయింది, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టీవ్ అవ్వడం బెటర్ అని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్న రోజుల్లో ఆయనకి ‘అఖండ’ లాంటి హిట్ పడింది.

2001 వ సంవత్సరం లో విడుదలైన ‘నరసింహ నాయుడు’ చిత్రం తర్వాత బాలయ్య కెరీర్ లో సింహా , లెజెండ్ వంటి చిత్రాలు మాత్రమే పూర్తి స్థాయి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. కానీ అఖండ తర్వాత బాలయ్య చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 20 ఏళ్ళల్లో 2 భారీ హిట్స్ ని మాత్రమే అందుకున్న బాలయ్య, 2020 వ సంవత్సరం తర్వాత ఏకంగా మూడు భారీ హిట్స్ ని అందుకున్నాడు. బాలయ్య తలరాతనే మార్చేసిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను ప్రకటించి చాలా కాలం అయ్యింది. నేడు చిత్రం గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ముహూర్తం షాట్ కి బాలయ్య చిన్న కూతురు తేజస్విని క్లాప్ కొట్టగా, ఆ తర్వాత బాలయ్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ‘ఉగ్ర భూతాలు భూమి మీద చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురులది కాదురా..ఈశ్వరుడిది..పరమేశ్వరుడిది..కాదని దానిని తాకితే, జరగబోయేది తాండవం..అఖండ తాండవం’ అంటూ పవర్ ఫుల్ గా ఆయన ఈ డైలాగ్ ని చెప్తాడు.

సినిమా టైటిల్ కూడా ‘అఖండ 2 : తాండవం’ అని ఫిక్స్ చేసారు. దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు బోయపాటి. ఇందులో బాలయ్య సనాతన ధర్మ పరిరక్షకుడిగా నటించబోతున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పరిరక్షణ గురించి చర్చలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ‘అఖండ 2 ‘ చిత్రాన్ని ఆ స్టోరీ లైన్ మీదనే తెరకెక్కించబోతున్నందున, ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది ద్వితీయార్థం లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు బోయపాటి శ్రీను.