Samantha: దీపావళి అనగానే దీపాల వెలుగులు, పూజలతో పాటు బాణాసంచ కాల్చడం. ఈ పండగ వస్తుందంటే చాలు రెండు మూడు రోజుల ముందు నుంచే వీధుల్లో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పిల్లలకు టపాసులు కాల్చడం అంటే ఎంతో సరదా. అయితే, ఈ టపాసులను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని కొన్ని సంవత్సరాలు వినిపిస్తున్న నినాదం. బ్యాన్ క్యాకర్స్ అనే నినాదంతో ప్రభుత్వాలూ ముందుకొస్తున్నాయి. అయితే, కేవలం నిర్దిష్ట సమయంలోనే టపాసులు కాల్చాలని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు కూడా విధించారు. కాగా, ఈ విషయంపై ఈషా ఫౌండేషన్ స్థాపకులు ఆధ్యాత్మిక గురువు సద్గులు జగ్గీ వాసుదేవ్ తనదైన శైలిలో స్పందించారు.
“కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం. పండగ అయిపోయినా సరే . ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజుల పాటు కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యంపై ఆందోళన చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి. మీ పిల్లలను కాల్చనివ్వండి. మీ ఆఫీసుకు కారులో కాకుండా… మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్టర్ వేదికగా విడుదల చేశారు.
అయితే, సద్గురు మాటలకు నటి సమంత మద్దతుగా నిలిచింది. సద్గురు వీడియోను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది. గత కొద్ది రోజులుగా సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్గా ఉంటోంది. పర్సనల్తో పాటు ప్రస్తుత పరిస్థితులపైనా స్పందిస్తూ.. తన అభిప్రాయాలను తెలియజేస్తోంది. సామ్ ప్రస్తుతం తన కెరీర్ పై పూర్తి దృష్టి సారించినట్లుగా టాక్. తన వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్.