సినిమా రంగంలో విజయాలు శాశ్వతం కాదు. తరచూ మారిపోతుంటాయి. అందుకే తారలు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పారితోషకాలను సక్సెస్ ఉన్నపుడే పెంచు కొంటూ పోతారు. ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఒక దర్శకుడు మరియు హీరో తమ కొత్త చిత్రాలకు తీసుకొంటున్న పారితోషకాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. నిజానికి ఒక పెద్ద సినిమా బడ్జెట్ లో సగానికి పైగా పారితోషకాలు హీరో మరియు దర్శకుడికే వెళ్లిపోతాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను నెక్స్ట్ తీబోయే చిత్రానికి గాను పారితోషకం గా 20 కోట్లు తీసుకొంటున్నాడట…
అల వైకుంఠపురములో చిత్రానికి డైరెక్ట్ చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పదిహేను కోట్ల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురం లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు జూనియర్ ఎన్ టి ఆర్ తో చేయబోయే సినిమాకి త్రివిక్రమ్ పారితోషికం ఇరవై కోట్లు అయిందట.
అలాగే ఈ సినిమాకి తారక్ కూడా తన పారితోషికం భారీగా తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్ టి ఆర్ కి ఈ సినిమాలో నటించేందుకు నలభై కోట్లు పారితోషకంగా ముడుతుంది. దానికి తోడు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి భాగస్వామి కాబట్టి అతనికి వచ్చే లాభంలో వాటా కూడా వసుంది. ఆ లెక్కన రెండు విధాలా లాభ పడ నున్నాడు.
కేవలం పారితోషకం గానే త్రివిక్రమ్, తారక్ ఈ చిత్రానికి అరవై కోట్లు వసూలు చేస్తుంటే అంటే ఇక మిగతా ఖర్చులన్నీ కలిపి ఎంత అవుతాయో …అని అందరూ షాక్ అవుతున్నారు. అనధికారంగా తెలుస్తున్న దాన్ని బట్టి ఈ సినిమాకి 120 నుంచి 130 కోట్ల దాకా బడ్జట్ అవుతుందని అంటున్నారు. ఇంత ఖర్చు పెట్టి నిర్మించే ఈ భారీ చిత్రానికి పేరేమిటో తెలుసా ? ..”.అయినను పోయిరావలె హస్తినకు ” వెరైటీగా వుంది కదూ.
Bread will made as per mill