తెలుగు తెర ఫై మరో మళయాళ కుట్టి

రీమేక్ చిత్రాలంటే ఎక్కువ మక్కువ చూపే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మరో రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా తమిళం లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అసురన్ ఇపుడు తెలుగులోవెంకటేష్ హీరోగా నారప్ప పేరుతొ రీమేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఇందులో ఇద్దరు హీరోయిన్ లు నటించాల్సి ఉంది . అందులో ఒక హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. కాగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేమరో […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 6:43 pm
Follow us on

రీమేక్ చిత్రాలంటే ఎక్కువ మక్కువ చూపే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మరో రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా తమిళం లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం అసురన్ ఇపుడు తెలుగులోవెంకటేష్ హీరోగా నారప్ప పేరుతొ రీమేక్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా ఇందులో ఇద్దరు హీరోయిన్ లు నటించాల్సి ఉంది . అందులో ఒక హీరోయిన్ గా ప్రియమణి నటిస్తోంది. కాగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేమరో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంలో చాలా వార్తలు బయటికి వచ్చాయి.. ఓ సందర్భంలో అమలాపాల్ నటిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మలయాళ ముద్దు గుమ్మ రెబా జాన్ రెండో హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన రెబా జాన్..గత ఏడాది వచ్చిన బిగిల్ (తెలుగులో విజిల్ ) చిత్రం లో అనిత అనే పాత్రలో నటించడం జరిగింది.ఆయా చిత్రాల్లో రెబా జాన్ నటన చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆమెను సంప్రదించడం ఆమె ఓకే అనడం జరిగిపోయింది.. ఆసక్తికరమైన విషయమేమంటే..ఈమె నా పేరు సూర్య,శైలజా రెడ్డి అల్లుడు ఫేమ్ అను ఇమ్మాన్యుయేల్ కి సోదరి అవుతుంది. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను, తెలుగు నిర్మాత డి.సురేశ్ బాబు తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో విడుదల అయ్యే నారప్ప చిత్రం అగ్రవర్ణాల , దళితుల మధ్య భూవివాదాల నేపథ్యంలో రూపొందుతోంది.
Beauty has no language barriers