
నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ వంటి బ్లాక్బస్టర్ మూవీని నిర్మించి, ప్రస్తుతం నాని హీరోగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని నిర్మిస్తోన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది మొత్తానికి హోటల్ బిజినెస్లోకి కూడా అడుగుపెట్టారు. పాపులర్ డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హైదరాబాద్లో “1980స్ మిలటరీ హోటల్”ను స్టార్ట్ చేశారు.
Also Read : ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల
కాగా దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా గ్రాండ్ గా ఈ రోజు ప్రారంభమైంది “1980స్ మిలటరీ హోటల్”. ఖాజగూడ-నానక్రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ హోటల్ పేరు వింటేనే నోరు ఊరుతోంది. తప్పకుండా ఈ హోటల్కు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ వ్యక్తం చేశారు.
సంప్రదాయబద్ధమైన, నోరూరించే తెలుగింటి రుచులతో, అత్యంత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ హోటల్లో అందిస్తామని “1980స్ మిలటరీ హోటల్” అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది చెప్పారు.
Also Read : తన కోరిక తీర్చుకోలేకపోతోన్న సమంత !