TS Dost Notification: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు షురూ.. దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల

జూన్‌ 19 నుంచి 25 వరకు దోస్త్‌ మూడో దశ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్‌ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి.

Written By: Raj Shekar, Updated On : May 3, 2024 4:31 pm

TS Dost Notification

Follow us on

TS Dost Notification: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.200 ఫీజుతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు దోస్ట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10 లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం ఇస్తారు.

సెకండ్‌ ఫేజ్‌ ఇలా..
ఇక రూ.400 రుసుంతో జూన్‌ 4 నుంచి 13 వరకు సెకండ్‌ ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ నిర్వహిస్తారు. జూన్‌ 4 నుంచి 14 వరకు సెకండ్‌ ఫేజ్‌ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 18న రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్‌ 19 నుంచి 24 వరకు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం ఉంటుంది.

మూడో దశ..
ఇక జూన్‌ 19 నుంచి 25 వరకు దోస్త్‌ మూడో దశ రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. రూ.400 రుసుంతో మూడో విడత రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్‌ 19 నుంచి 25 వరకు మూడో దశ వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 29న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

జూలై 8 నుంచి తరగతులు..
మూడు దశల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభిస్తారు. జూలై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి. అన్ని యూనివర్సిటీల పరిధిలో ఒకే రోజు నుంచి తరగతులు నిర్వహిస్తారు.