Homeఎడ్యుకేషన్Rajkumari Ratnavati Girls School: థార్ ఎడారిలో బాలికల పాఠశాల.. 50 డిగ్రీల సెల్సియస్ ఎండలో...

Rajkumari Ratnavati Girls School: థార్ ఎడారిలో బాలికల పాఠశాల.. 50 డిగ్రీల సెల్సియస్ ఎండలో ఫ్యాన్, ఏసీ లు లేకుండానే చల్లదనం! ఇది ఎలా సాధ్యమంటే?

Rajkumari Ratnavati Girls School: రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్ ప్రాంతంలో రాజకుమారి రత్నావతి పేరుతో ఒక బాలికల పాఠశాల ఉంది. ఈ పాఠశాల లో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు చల్లగానే ఉంటుంది. అయితే ఈ పాఠశాలలో కిండర్ గార్డెన్ నుంచి పదవ తరగతి వరకు 400 మంది వరకు బాలికలు చదువుతున్నారు.. వారికి ఇక్కడ వసతి కల్పించడానికి ప్రత్యేకమైన గదులు నిర్మించారు. కేవలం పాఠాలు మాత్రమే కాకుండా సృజనాత్మకత, ఎంబ్రాయిడరీ వంటి వాటిల్లో శిక్షణ కూడా ఇస్తారు. ఈ పాఠశాల సిఐటిటిఏ యాజమాన్యంలో కొనసాగుతోంది. అయితే ఈ పాఠశాలలో ఫ్యాన్లు ఉండవు. ఏసీలు అంతకన్నా ఉండవు. ఎడారిలో కట్టిన ఈ భవనం పైన సౌర ఫలకలు ఉన్నాయి. వీటి ద్వారానే పాఠశాలకు అవసరమైన విద్యుత్తు తయారీ అవుతుంది. అయితే ఎడారిలో.. విపరీతమైన ఎండలో కట్టిన ఈ భవనం చల్లగా ఉంటుంది. 50 డిగ్రీల ఎండలోనూ ఫ్యాన్లు, ఏసీలు లేకుండానే శీతలంగా ఉంటుంది.

Also Read: గుజరాత్ ను ఓడించడానికి.. ముంబై మోసం చేసిందా? వెలుగులోకి సంచలన నిజం

ఈ పాఠశాల భవనాన్ని డయానా కెల్లాగ్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ నిర్మించింది.. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సామ్ నగరంలో పశ్చిమాన ఉంది. ఇసుక దిబ్బలకు దగ్గర్లో ఈ పాఠశాల నిర్మించారు. ఈ పాఠశాల కనోయి అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది. ఎడారి మధ్యలో ఈ భవనాన్ని ఓవల్ ఆకారంలో నిర్మించారు. ఓవల్ ఆకారంలో నిర్మించడం వల్ల ఎండను తట్టుకుంటుంది. పైగా చల్లని వాతావరణాన్ని అందిస్తుంది. పాఠశాల లోపలి గోడలపై సున్నపు ప్లాస్టర్ ఉపయోగించారు. సున్నపు ప్లాస్టర్ ఉపయోగించడం వల్ల అది గోడలను చల్లగా ఉంచుతుంది. సున్నపు ప్లాస్టర్లో పోరస్ అనే పదార్థం ఉంటుంది. దీని డిజైన్ లో జాలి గోడ ఉంది. ఇది గాలిని త్వరగా ప్రసరించేలా చేస్తుంది. ఇది ఇసుకరాయి గ్రిడ్ ను పోలి ఉంటుంది. ఇసుకరాయితో నిర్మించడం వల్ల ఇది చల్లగా ఉంటుంది. ఈ పాఠశాలను మూడు అంతస్తులలో కట్టారు. విశాలమంతమైన హాలు, లైబ్రరీ, మ్యూజియం ఇందులో ఉన్నాయి. పైగా ఈ భవనంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి గుంతలు కూడా ఏర్పాటు చేశారు. భూగర్భ జలాలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. డ్రైనేజీ నీటిని శుద్ధిచేసి.. వాటిని వాడుకుంటున్నారు. ఈ పాఠశాలలో చదువుకునే పిల్లల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఈ పాఠశాల నిర్వహణ అద్భుతంగా నేపథ్యంలో 2020లో ఏడీ 100 పురస్కారం అందుకుంది. ఆర్కిటెక్చర్ డైజెస్ట్ అనే సంస్థ కూడా ఈ పాఠశాల యాజమాన్యానికి పురస్కారాన్ని అందించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper