
భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 458 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్స్ మెన్, జేఓఏ, మెటీరియల్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఫైర్ మెన్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజైన 21 రోజుల్లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.
మొత్తం 458 ఉద్యోగ ఖాళీలలో 330 ట్రేడ్స్ మెన్ మేట్ పోస్టులు ఉన్నాయి. పది పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. జేఓఏ విభాగంలో మొత్తం 20 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 19,900 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. మెటీరియల్ అసిస్టెంట్ విభాగంలో 19 ఉద్యోగ ఖాళీలు ఉండగా గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 29,200 రూపాయల నుంచి 56.900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఎంటీఎస్ విభాగంలో మొత్తం 11 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫైర్ మెన్ విభాగంలో 64 ఉద్యోగ ఖాళీలు ఉండగా పది పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏబీఓయూ ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగ ఖాళీలకు కూడా పది పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.