Homeఎడ్యుకేషన్నిరుద్యోగులకు శుభవార్త.. 65,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

నిరుద్యోగులకు శుభవార్త.. 65,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. అయితే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్నాయి. పార్లమెంట్ ఆఫ్ ఇండియా పీపీఆర్ విభాగం తాజాగా నిరుద్యోగులకు మేలు జరిగేలా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది.

Lok Sabha Recruitment 2021 Apply 39 Consultant Pay scale over Rs 60000

మొత్తం 11 ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుంది. అసోసియేట్ సీనియర్ కంటెంట్ రైటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, జూనియర్ కంటెంట్ రైటర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు పీపీఆర్ వింగ్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో పని చేయాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 65,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఏడాది కాంట్రాక్ట్ తో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు కాంట్రాక్ట్ గడువు పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://loksabhaph.nic.in/recruitment/advandnot.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఆరోగ్య బీమా లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ -1, రూమ్ నెం. 619, న్యూఢిల్లీ- 110001 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular