Homeఎడ్యుకేషన్JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025 షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌...

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025 షెడ్యూల్‌ విడుదల.. ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ!

JEE Mains 2025: జేఈఈ మెయిన్స్‌ – 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈమేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం(అక్టోబర్‌ 28న) విడుదల చేసింది. రెండు సెషన్లుగా ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. జేఈఈ మెయిన్‌–1 2025, జనవరిలో జరుగనుండగా, సెషన్‌ – 2 పరీక్షలు ఏప్రిల్‌ 2025లో నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. జనవరి సెషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 28, 2024 నుంచే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించింది. నవంబర్‌ 22 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈమేరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి31 వరక నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తామని ఎన్‌టీఏ తెలిపింది.

రెండు పేపర్లు..
జేఈఈ మెయిన్స్‌లో రెండు పేపర్ల ఉంటాయి. పేపర్‌–1( బీఈ, బీటెక్‌)ను ఎన్‌ఐటీ, ఐఐటీ, సీఎఫ్టీఐ, యూనివర్సిటీలు ఇతర 6పముఖ సంస్థల్లో అండగర్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ బీఈ, బీటెక్‌ ప్రవేశాలకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌–1ను జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హతతో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్స్‌ పేపర్‌ – 2తో బీఆర్క్, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ ఆధారంగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 13 భాషల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

షెడ్యూల్‌ ఇలా..

– ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పణ 28 అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 22 వరక అవకాశం ఉంది.

– ఫీజు చెల్లింపునకు గడవు 2024 నవంబర్‌ 22 వరకు చెల్లించాలి.

– పరీక్ష కేంద్రాల ప్రకటన 2025 జనవరి తొలివారంలో ప్రకటిస్తారు. .

– అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ పరీక్షకు 3 రోజుల ముందు విడుదల చేస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version