Homeఎడ్యుకేషన్కేంద్ర ప్రభుత్వ సంస్థలో 220 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా..?

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 220 ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా..?

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ తాజాగా ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 220 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌, లా, మార్కెటింగ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. నిరుద్యోగులకు వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

ఈ నెల 7వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలు పెరుగుతాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular