పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థలో 250 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వివిధ ట్రేడ్ లలో అప్రెంటీస్ జాబ్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మహారాష్ట్ర రాష్ట్రంలోని […]

Written By: Navya, Updated On : October 30, 2021 7:42 pm
Follow us on

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వివిధ ట్రేడ్ లలో అప్రెంటీస్ జాబ్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 250 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మహారాష్ట్ర రాష్ట్రంలోని తారాపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 14 నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

నవంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉద్యోగ ఖాళీలు, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉండగా మిగిలిన ఉద్యోగ ఖాళీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.