ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. అమరరాజా సంస్థలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. నవంబర్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిష్టర్ చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. చిత్తూరులోని అమర రాజా గ్రూప్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రాయితీపై భోజన సదుపాయంతో పాటు వసతిని రాయితీపై పొందవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. https://apssdc.in/industryplacements/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.