Woman Accused Of Killing 5 Year Old: నేటి కాలంలో మనుషుల మధ్య కట్టుబాట్లు అనేవి ఉండడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చాటుమాటు సంబంధాల కోసం పరితపిస్తున్నారు. వివాహేతర వ్యవహారాలలో పీకల లోతు మునిగిపోయి.. కట్టుకున్న వాళ్లను.. కన్నవాళ్ళను దూరం చేసుకుంటున్నారు. కడుపున పుట్టిన వాళ్ళని కూడా కాదనుకుంటున్నారు. చివరికి వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.
గతంలో ఇటువంటి దారుణాలకు మగవాళ్ళు మాత్రమే పాల్పడేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళని మించి ఆడవాళ్లు చేస్తున్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో తన ప్రియుడితో ఉంటున్న ఓ వివాహిత.. కుమారుడిని అత్యంత దారుణంగా చంపేసింది. అతడి చేతిలోను విరిచేసింది. దాదాపు 150 కి పైగా గాయాలు చేసింది. ఈ ఘటనను మర్చిపోకముందే బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం తాను జన్మనిచ్చిన ఆరు సంవత్సరాల కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన 3 నెలల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని దావా నగరే ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ప్రియాంకకు 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. వీరికి ఒక బాబు, ఒక పాప సంతానం. ఇటీవల ప్రియాంక దారితప్పింది. తన భార్య స్నేహితుడు మోహన్ తో వివాహేత్ర సంబంధం పెట్టుకుంది. ప్రియాంక వివాహం భర్త ప్రవీణ్ కు తెలిసింది. దీంతో అతడు ఆమెను మందలించాడు.
కుమారుడిని భర్త వద్ద వదిలిపెట్టి.. మోహన్ తో కలిసి ఉండడం ప్రారంభించింది. సరిగా మూడు నెలల క్రితం కుమార్తె మరణించింది అని ప్రవీణ్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అతడికి అనుమానం రావడంతో.. పోస్టుమార్టం నివేదికను పంపించింది. అయితే ఆ రిపోర్టును ప్రవీణ్ తన స్నేహితులకు పంపించాడు. అతడు ఒక వైద్యుడు. ఆ రిపోర్టు మొత్తం చదివి అందులో లోపల ఉన్నయని చెప్పాడు.. ఆహారం వికటించి పాప చనిపోయినట్టు రిపోర్టు రూపొందించాలని అతడు గుర్తించాడు.
ప్రవీణ్ ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రి మీద కేసు నమోదు చేశారు. మరొక ప్రియాంక ప్రియుడితో కలిసి మూడు నెలల క్రితమే ఆరు సంవత్సరాల కుమార్తెను చంపినట్టు తెలుస్తోంది. ప్రియాంక ప్రస్తుతం పరారీలో ఉంది. మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నతల్లి ప్రేమకే కళంకం తెచ్చిన ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కాగా, కుమార్తె తమ బంధానికి అడ్డుగా ఉందనే ప్రియాంక ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
