spot_img
Homeక్రైమ్‌Girls Jewellery Shop Robbery: అందంగా ముస్తాబై మొత్తం చూపించారు.. షాపు ఓనర్ గట్టిగా పట్టుకున్నాడు..పోలీసుల...

Girls Jewellery Shop Robbery: అందంగా ముస్తాబై మొత్తం చూపించారు.. షాపు ఓనర్ గట్టిగా పట్టుకున్నాడు..పోలీసుల ఎంట్రీ.. ఇంతకీ ఈ అమ్మాయిలు ఏం చేశారో తెలుసా..

Girls Jewellery Shop Robbery: ఒకప్పుడు దొంగతనాలు కేవలం మగవాళ్ళు మాత్రమే చేసేవారు. ఎక్కడో పూలన్ దేవి లాంటి వాళ్ళు మాత్రమే చోర కళను ప్రదర్శించేవారు. కానీ ఇప్పటి కాలంలో అబ్బాయిలను అమ్మాయిలను మించి పోతున్నారు. దొంగతనాలు చేయడంలో ఆరి తేరిపోతున్నారు. ఆమధ్య ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి తన స్నేహితుడికి ఐఫోన్లు కొనివ్వడానికి ఏకంగా దొంగతనం చేసింది. చివరికి దొరికిపోయి జైలు పాలయింది.

ఖమ్మం యువతిని ఆదర్శంగా తీసుకున్నారేమో.. ఈ బీహార్ అమ్మాయిలు కూడా దొంగతనం చేశారు. చివరికి దొరికిపోయారు. అసలు ఎలా దొరికిపోయారు.. ఏం దొంగతనం చేశారు.. ఇంతకీ ఏం జరిగింది.. ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ మాదిరిగా ఉంది.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు అత్యంత అందంగా ముస్తాబయ్యారు. కైపు కలిగించే విధంగా దుస్తులు ధరించారు. ఇద్దరు కలిసి ఓ బంగారం షాపుకు వెళ్లారు. అక్కడ నగలు కొనే వారి విధంగా బిల్డప్ ఇచ్చారు. ఆ షాప్ లోకి వెళ్లిన తర్వాత యజమానిని మాటలలో పెట్టారు. ఒక యువతి షాప్ ఓనర్ ముందు అన్ని చూపించడం మొదలుపెట్టింది. అతడేమో చొంగ కార్చుకుంటూ ఆమెను చూడటం ప్రారంభించాడు. మరో యువతి అతడి మీద పెప్పర్ స్ప్రే చేసింది. బంగారు నగలను మూట కట్టుకొని పారిపోతుండగా.. షాపు ఓనర్ తేరుకున్నాడు. గట్టిగా అరిచాడు. ఆ తర్వాత వారిని పట్టుకున్నాడు. మిగతా వారంతా అతడికి అండగా నిలిచారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి రహస్య కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఆ అమ్మాయిలు గతంలో కూడా దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.. అమ్మాయిలు కావడంతో పోలీసులు మందలించి వదిలిపెట్టారు. అయితే పోలీసులు తమను ఏమీ చేయలేరని ధైర్యంతో మళ్ళీ దొంగతనానికి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. అందమైన అమ్మాయిలను చూసి చొంగ కార్చొద్దని.. షాపు ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం విలువ పెరిగిపోయిన నేపథ్యంలో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని.. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మాయమాటలకు కరిగిపోతే చివరికి ఉన్నది మొత్తం కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Patna Press (@patna.press)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular