Nalgonda Family Crime News: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ నగరంలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు అంతమయ్యారు. ఈ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. నిందితులు ఒక ఆధారాన్ని కూడా పోలీసులకు లభించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ కేసును అత్యంత సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు ప్రాంతంలో తెలంగాణ కాలనీ ఉంటుంది.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇక్కడ చనిపోయారు. గడిచిన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దారుణంలో హసీనా.. ఆమె ముగ్గురు కుటుంబ సభ్యులు ఘోరమైన స్థితిలో చనిపోయారు. మొదట్లో దీనిని గుర్తు తెలియని వ్యక్తుల పనిగా భావించారు.
పోలీసులకు రకరకాల అనుమానాలు ఉండడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక దర్యాప్తులో హసీనా పేరు మీద ఉన్న ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఆస్తికోసం హసీనా మొదటి కూతురు (మొదటి భర్త ద్వారా జన్మించింది), ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ దారుణం చేయాలని హైదరాబాద్ నుంచి కొంతమంది గ్యాంగ్ ను ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది.
ఆ గ్యాంగ్ సభ్యులకు అన్ని రకాలుగా సమాచారాన్ని హసీనా మొదటి కూతురు చెప్పింది. దీంతో వారు హత్యకముందే ఇక్కడ రెక్కి నిర్వహించారు.. అన్ని విధాలుగా చూసుకున్న తర్వాత వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సుఫారి గ్యాంగ్ హసీనా ఇంటికి వెళ్ళింది. ముందుగా ఆమెను బయటికి పిలిచారు. ఆమె రాగానే కత్తెలతో దారుణంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమిల్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిని కూడా దారుణంగా అంతం చేశారు.. ఏదో గొడవ జరుగుతోందని మెలకువ వచ్చిన సుల్తాన్ (హసీనా మూడో భర్త) ను వారు చంపేశారు. ఇదంతా చూసిన మరో కుమార్తె అక్సరా ను ఆ దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. నలుగురిని చంపిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
ఈ ఘటనలో మొత్తం ఎన్ని మంది పాలుపంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కూతురు.. అల్లుడు.. నలుగురు నిధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘోరానికి పాల్పడిన దాచిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు..
అందువల్లే గొడవ
హసీనా కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. కొంతకాలం క్రితం సుల్తాన్ ను మూడవ వివాహం చేసుకుంది. అతడికి కూడా ఇది మూడవ వివాహం.. సుల్తాన్ కు మొదటి భార్య ద్వారా కలిగిన ముజమిల్, అక్సారా సంతానంతో కలిసి హసీనా ఉంటుంది. హసీనా పేరు మీద ఏకంగా స్థలాలు.. గృహాలు ఉన్నాయి. వీటి విలువ ఏకంగా కోట్లల్లో ఉంటుంది. అయితే వీటిని సుల్తాన్ పిల్లల మీద రాస్తున్నట్టు ఇటీవల హసీనా ప్రకటించింది. దీంతో హసీనాకు మొదటి భర్త ద్వారా కలిగిన కుమార్తె.. ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.
