Homeక్రైమ్‌Medak : తాగిన మైకంలో మనుషులమనే సంగతి మరిచిపోయారు.. మతిస్థిమితం లేని వ్యక్తిపై దారుణం

Medak : తాగిన మైకంలో మనుషులమనే సంగతి మరిచిపోయారు.. మతిస్థిమితం లేని వ్యక్తిపై దారుణం

A Beggar Murder In Medak  : ఇటీవల మెదక్ జిల్లాలో మతిస్థిమితం లేని వ్యక్తి చనిపోయాడు. మొదట్లో అతడి మరణాన్ని సహజమైనదిగా భావించారు. అయితే పోలీసులు విచారణ నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో మతిస్థిమితం లేని 40 సంవత్సరాల వ్యక్తి కొంతకాలంగా ఇక్కడే భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు.. అతడికి హిందీ తప్ప మరో భాష రాదు. ఈనెల 4న అతడు బస్టాండ్ లో పడుకున్నాడు. అతడు దొంగతనం చేశాడని భావించి రాత్రి 11:30 నిమిషాల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్ దాడి చేశారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు.. ఆ మైకంలో అతడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. అతనిపైకి బైక్ ఎక్కించారు. తనను కొట్టొద్దని అతడు బతిమిలాడినప్పటికీ వారు కనికరించలేదు. పైగా పైకి లేపి కింద పడేశారు. ద్విచక్ర వాహనానికి అతనిని కట్టేసి ఈడ్చుకు వెళ్లారు. చనిపోయాడని భావించిన తర్వాత వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు మొత్తం బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. అయితే మొదట్లో అతడిది సహజ మరణం అని కొంతమంది భావించారు. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నిందితులను కాపాడేందుకు..

మతిస్థిమితం లేని ఆ వ్యక్తి మరణాన్ని పోలీసులు ముందుగా సాధారణ మృతిగానే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెళ్లడయ్యాయి. ఆ తర్వాత నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వ్యక్తికి శివపరీక్ష నిర్వహించారు. మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ కేసులో అసలు నిజం సీసీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జపం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. విచారణ నిమిత్తం నిందితులను తీసుకెళ్లినప్పటికీ.. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకురావడంతో తిరిగి పంపించాలని ఆరోపణలు ఉన్నాయి. ఐదవ తేదీన ఈ ఘటన వెలుగులోకి రాగా.. తొమ్మిదో తేదీన నిందితులను పోలీసులు అరెస్టు చేయడం.. మణికంఠ గౌడ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ నాయకుడికి చెందిన యువజన విభాగంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. తిరుపతి రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్నాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు నామమాత్రంగా వెల్లడించడం పలు ఆరోపణలకు తావిస్తోంది. అయితే దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒక మనిషిని అత్యంత అమానవీయంగా చంపినప్పటికీ.. నిందితులపై సకాలంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మండిపడుతున్నారు.. ఇప్పటికైనా పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version