Homeక్రైమ్‌Crime News : స్నేహం నటిస్తూ అత్యాచారం.. ప్రేమ పేరుతో లైంగిక దాడి... పెళ్లి మాటున...

Crime News : స్నేహం నటిస్తూ అత్యాచారం.. ప్రేమ పేరుతో లైంగిక దాడి… పెళ్లి మాటున పైశాచికత్వం.. దేవుడా.. ఆడపిల్లలపై ఏంటీ అఘాయిత్యాలు

Crime News : గుండెల నిండా ప్రేమిస్తున్నానని.. కంటికి రెప్పలా చూసుకుంటానని.. పెళ్లి చేసుకుంటానని.. ఇలా రకరకాల పేర్లతో నమ్మించి కామాంధులు ఆడపిల్లలను వంచిస్తున్నారు. దీంతో అభం శుభం తెలియని అమ్మాయిలు బాధితులుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఈ తరహా సంఘటనలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి..

ప్రేమిస్తున్నానని చెప్పి..

మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ నాగోల్ లో ఓ హోటల్ లో బౌన్సర్ గా పని చేస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఇదే క్రమంలో ఎల్బీనగర్ ప్రాంతంలోని హోటల్ కు తీసుకెళ్లాడు. ఆమెపై పలుసార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం చేస్తే.. గత ఏప్రిల్ లో వివాహం నిశ్చయించుకున్నాడు. నెలలు గడుస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె ఒత్తిడి తీసుకొస్తే దాడి చేసి ఇబ్బంది పెట్టాడు. దీంతో మోసపోయానని భావించిన ఆమె అతనిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలికలపై దారుణం

జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలానికి చెందిన 14 సంవత్సరాల బాలిక, మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలిక ఐఎస్ డివిజన్లో ఉన్న పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. గత నెల 24న ఆ ప్రాంతం నుంచి బాలికలు ఇద్దరు పారిపోయి జనగామ వచ్చారు. బస్టాండ్ సమీపంలో ఓ పాన్ షాప్ నిర్వహించే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకొని.. తమకు పరిచయం ఉన్న మరో యువకుడికి ఫోన్ చేసి.. తాము ఉన్న ప్రాంతం, ఇతర వివరాలు వెల్లడించారు. బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న ఆ యువకుడు జనగామ జిల్లాకు చెందిన బాలికను వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక బస్టాండ్ దగ్గర ఉన్న మరో బాలికకు షెల్టర్ ఇస్తానని చెప్పిన పాన్ షాప్ నిర్వాహకుడు, అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై లైంగికంగా దాడికి పాల్పడ్డారు. అయితే ఆ బాలికలు మరుసటి రోజు బస్టాండ్ వద్ద ఒంటరిగా తిరుగుతున్న నేపథ్యంలో జనగామ అర్బన్ పోలీసులు గుర్తించారు. వారిని వివరాలు అడగడంతో అసలు విషయం చెప్పారు. ఆ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

కారులో లాడ్జికి తీసుకెళ్లి..

ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన తాటి శివరాజ్ కుమార్ .. స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు.. శివరాజ్ కు భూపాలపల్లి ప్రాంతానికి చెందిన పుట్టపాక శరత్ అనే స్నేహితుడు ఉన్నాడు. శరత్ కు వరంగల్ ప్రాంతంలోని ఓ కాలేజీలో చదువుతున్న యువతి పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని శరత్ చెప్పడంతో ఆమె నిరాకరించింది. స్నేహితులుగా మాత్రమే ఉందని పేర్కొంది.. దీంతో శివరాజ్ కుమార్, అతని ఫ్రెండ్స్ వివేక్, మణి దీప్ కారులో ఆమె చదువుకుంటున్న కళాశాలకు వెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఆమెను వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్న లాడ్జికి తీసుకెళ్లి లైంగికంగా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version