కరోనా వైరస్దేశంలోకి కరోనా వైరస్ ను మోసుకొచ్చింది వాళ్లేనంట..?

దేశంలోకి కరోనా వైరస్ ను మోసుకొచ్చింది వాళ్లేనంట..?

did they carry the corona virus into the country

దేశంలోని ప్రతి ఒక్కరినీ కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. గతంతో పోలిస్తే కరోనా భయం తగ్గినప్పటికీ వైరస్ బారిన పడితే మాత్రం ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాల్లో కొన్ని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటనలు వెలువడుతున్నా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం, సమాచారం ఎవరి దగ్గరా లేదు.

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజి మండి కరోనా వైరస్ దేశంలో ఎలా ప్రవేశించిందనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్​, బ్రిటన్​ దేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికుల వల్లే మన దేశంలోకి వైరస్ వ్యాప్తి చెందిందని.. వాళ్లే పరోక్షంగా దేశంలో భారీగా కేసులు నమోదు కావడానికి కారణమయ్యారని ఐఐటీ మండీ చేసిన అధ్యయనంలో తేలింది.

ఐఐటీ మండి వైరస్ తొలుత విజృంభించిన డేటాను విశ్లేషించి ఈ ఫలితాలను వెల్లడించారు. దేశంలోకి జనవరి ఏప్రిల్ మధ్య వచ్చిన వారి డేటా ద్వారా ఆ దేశాల ప్రయాణికుల నుంచి ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందినట్టు వెల్లడైంది. దుబాయ్, బ్రిటన్ నుంచి ప్రైమారీ కాంటాక్ట్ లను సోకిన వైరస్ వారి నుంచి ఇతరులకు సోకిందని తేలింది.

గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్​, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని.. అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందిందని అన్నారు. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్​లో సామూహిక వ్యాప్తి జరగలేదని ఐఐటీ మండీ సర్వే నిరాహకులు చెప్పారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

India Pakistan : పాకిస్తాన్‌పై మోదీ బురద బాంబు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం!

India Pakistan : భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నీటి వనరులు ఎప్పుడూ సున్నితమైన అంశంగా ఉన్నాయి. గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ 1960 నాటి సిందూ...

Most Popular

Covid Virus: వైరస్ వస్తే మరణమే.. మళ్లీ ప్రపంచానికి ‘చైనా’ వైరస్ భయం

వైరస్ పై వ్యూహాన్ లో ఒక అధ్యయనం జరిపారని.. ఇప్పుడు ఆ విషయం బయటపడిందని సదరు కథనాల్లో తెలుస్తోంది. ఆ అధ్యయన వివరాల ప్రకారం సార్స్ కోవ్_2 కు చెందిన జీ ఎక్స్ పీ _2 వీ అనే ఉపరకంపై డ్రాగన్ దేశ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Corona: కరోనా ఎఫెక్ట్: మళ్లీ వర్క్ ఫ్రం హోం యేనా?

కోవిడ్‌ మహమ్మారి ఐటి పరిశ్రమలో సంస్కరణాత్మక మార్పులను తీసుకువచ్చింది, ఇది ఇంటి నుండి పని సంస్కృతికి నాంది పలికింది. అయితే మూడు వేరియంట్ల విజృంభణ తర్వాత ఇటీవలే ఉద్యోగులకు కంపెనీల బాట పట్టారు.

Corona: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలుంటే డేంజర్ లో ఉన్నట్టే

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పండుగ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Corona: తెలుగు రాష్ట్రల్లో కరోనా కలకలం

ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలికేసు నమోదయింది. 85 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు సమాచారం. శాంపిల్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు.

COVID-19 Cases: ఇండియాలో మళ్లీ ‘కొవిడ్‌’ బెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4.5కోట్లుగా ఉంది. రికవరీలు 4,44,69,931గా నమోదైంది. ఫలితంగా.. కొవిడ్‌ రికవరీ రేట్‌ 98.81శాతంగా ఉంది.
Oktelugu Epaper
Exit mobile version