spot_img
Homeఅప్పటి ముచ్చట్లుఆయన వల్లే గొప్ప హీరో, గొప్ప విలన్ దొరికారు.

ఆయన వల్లే గొప్ప హీరో, గొప్ప విలన్ దొరికారు.

Patala Bharavi Movie
‘సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా’ ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమసే. డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా డైలాగ్ ఇది. అయినా ‘పాతాళ భైరవి’ అనే సినిమా ఈ రోజుకూ తెలుగులో వచ్చిన గొప్ప ఫాంటసీ సినిమాగానే నిలిచిపోయింది. మరి ఇంత గొప్ప సినిమా రాక వెనుక జరిగిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. విజయావారు షావుకారు అనే సినిమా తీసిన తరువాత ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తూ కాలం గడుపుతున్న రోజులు అవి.

ఎవరో రచయిత పింగళిగారు అట, కథ చెబుతా అని తమ చుట్టూ తిరుగుతున్నారని విజయావారుకి తెలిసింది, పిలిపించి కథ విన్నారు, బాగుంది. కానీ మేము ఈ కథతో సినిమా చెయ్యము అని చెప్పారు. కారణం.. ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకొన్నారు విజయావారు. దీనికి కాశీమజీలీ కథలను, అల్లాద్ధీన్ కథలను ప్రేరణగా తీసుకొని కథ ఏదైనా ఉంటే రాయమని కోరారు పింగళిగారిని. అల పుట్టింది ఈ పాతాళభైరవి కథ. కాగా 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రాల్లోనే నేటికీ మేటి చిత్రంగానే చరిత్రలో నిలిచిపోయింది

అయితే ఈ సినిమా నటీనటుల విషయంలో కూడా భలే తమాషా జరిగిందట. మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, ముక్కామలను ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు విజయావారు. అయితే సంసారం అనే సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ ను చూసిన కె.వి.రెడ్డి తన సినిమాలో ఎన్టీఆర్ హీరో అయితే చాల బాగుంటుందని ఫీల్ అయ్యారు. అలాగే ఓ నాటకంలో ఎస్వీఆర్ ను చూసి.. విలన్ గా ఆయనే కావాలని పట్టుబట్టి మరీ ఎస్వీఆర్ ను విలన్ ను చేశారు. మొత్తానికి కేవీ రెడ్డి వల్ల తెలుగు సినిమాకి గొప్ప హీరో, గొప్ప విలన్ దొరికారు.

ఇక 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఈ సినిమానే కావడం నిజంగా విశేషమే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version