ఇక్కడే కాపురం పెడుతున్నా – శ్రియా

సీనియర్ బ్యూటీ శ్రియా పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియా వదిలేసి స్పెయిన్ లోనే తన భర్త ఆండ్రీ కొశ్చెవ్ తో కలిసి సెటిల్ అయిపోయింది. స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో కాపురం పెట్టిన కొత్తల్లో చాల బాగుందని, బాగా ఎంజాయ్ చేశాను అని కొన్ని తీపి అనుభవాలను తల్చుకుని సిగ్గు పడుతూ చెప్పిన శ్రియాకి ఇప్పుడు స్పెయిన్ నచ్చట్లేదట. మూడేళ్లు తన భర్తతోనే కలిసి ఉండి బోర్ గా అనిపిస్తుందని.. అందుకే ఇక ఇండియాకి తిరిగి రావాలని […]

Written By: admin, Updated On : June 1, 2021 5:01 pm
Follow us on

సీనియర్ బ్యూటీ శ్రియా పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియా వదిలేసి స్పెయిన్ లోనే తన భర్త ఆండ్రీ కొశ్చెవ్ తో కలిసి సెటిల్ అయిపోయింది. స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో కాపురం పెట్టిన కొత్తల్లో చాల బాగుందని, బాగా ఎంజాయ్ చేశాను అని కొన్ని తీపి అనుభవాలను తల్చుకుని సిగ్గు పడుతూ చెప్పిన శ్రియాకి ఇప్పుడు స్పెయిన్ నచ్చట్లేదట.

మూడేళ్లు తన భర్తతోనే కలిసి ఉండి బోర్ గా అనిపిస్తుందని.. అందుకే ఇక ఇండియాకి తిరిగి రావాలని అనుకుంటున్నాను అని శ్రియా చెబుతుంది. 2018లో శ్రియా తన పెళ్లిని సింపుల్ గా ముంబైలో చేసుకుంది. పెళ్లి తరువాత హనీమూన్ అంటూ చాల ప్రదేశాలు తిరిగిన ఈ బ్యూటీ, ఎక్కువ కాలం స్పెయిన్ లోనే ఉంది. మధ్యలో ఏదో సినిమా వస్తే.. షూటింగ్ వచ్చి వెళ్ళేది.

కానీ ఇప్పుడు శ్రియా మూట ముల్లె సర్దుకొని ఇండియాకి వచ్చేస్తోంది. ఇక నుండి ఇండియాలోనే ఉంటాం అని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి క్లారిటీ ఇచ్చింది. శ్రియా పోస్ట్ చేస్తూ ‘ఇండియాకి తిరిగి వస్తున్నాము. ఇంటిని మిస్ అవుతున్నా. నమస్తే… బై బై’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. మొత్తానికి శ్రియా, తన భర్తతో ముంబైలోనే కాపురం పెడుతారట.

దీనికి మొదట్లో శ్రియా భర్త ఒప్పుకోలేదు అని, అయితే శ్రియా మాత్రం నేను ఇండియాలోనే ఉంటాను, ఎవరీ త్రి మంత్స్ కి ఒకసారి కలుద్దాం అంటూ కొత్తరకం ప్రపోజల్ పెట్టిందట. ఈ మాటలకు షాక్ అయినా ఈ ముదురు భామ మొగుడు మొత్తానికి ఇండియాలోనే కాపురానికి ఒప్పుకున్నాడు. ఇక 37 ఏళ్ల శ్రియాకి ఇంకా పిల్లలు కలగలేదు. ప్రస్తుతం పిల్లలను కనాలనే ఆలోచన లేదని చెబుతుంది శ్రియా.