ఈసారి జాతిరత్నాలు ‘మార్షల్ ఆర్ట్స్’తో నవ్విస్తారు

జాతిరత్నాలు మూవీతో కామెడీ పండించిన దర్శకుడు అనుదీప్. ఈ సినిమాకు ముందే ఆయన చేతిలో మూడు కథలు రెడీగా ఉన్నాయి. కామెడీ బేస్డ్ గానే ఆయన కథలున్నాయట.. ఇప్పుడు అందులోని ఒక కథనే ‘మార్షల్ ఆర్ట్స్’ నేపథ్యం గలదట.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని బయలుదేరి వాళ్లు పడే ఇబ్బందులు, ఇరుకునపడిపోయి కామెడీ పండించిన ఘటనలు రాసుకున్నాడట.. ఈ కథ ను హీరో రామ్ తో చేయాలని అనుదీప్ భావిస్తున్నాడట.. వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే నాగ్ అశ్విన్ […]

Written By: NARESH, Updated On : April 6, 2021 6:55 pm
Follow us on

జాతిరత్నాలు మూవీతో కామెడీ పండించిన దర్శకుడు అనుదీప్. ఈ సినిమాకు ముందే ఆయన చేతిలో మూడు కథలు రెడీగా ఉన్నాయి. కామెడీ బేస్డ్ గానే ఆయన కథలున్నాయట.. ఇప్పుడు అందులోని ఒక కథనే ‘మార్షల్ ఆర్ట్స్’ నేపథ్యం గలదట.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని బయలుదేరి వాళ్లు పడే ఇబ్బందులు, ఇరుకునపడిపోయి కామెడీ పండించిన ఘటనలు రాసుకున్నాడట.. ఈ కథ ను హీరో రామ్ తో చేయాలని అనుదీప్ భావిస్తున్నాడట..

వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే నాగ్ అశ్విన్ నిర్మాతగా ఇదే జాతిరత్నాలు డైరెక్ట్ చేసిన అనుదీప్ రెండో సినిమా కథ రెడీ అయినట్టు సమాచారం. అయితే హీరోగా ‘నవీన్ పొలిశెట్టి’నే తీసుకోవాలని భావిస్తున్నాడట.. హీరో రామ్ ను పరిశీలిస్తున్నారట..

అయితే ఇప్పటికే జాతిరత్నాలు హిట్ తో హీరో నవీన్ కు అనుదీప్ ఒక కథ చెప్పాడని.. దాంతోనే సినిమా ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి జాతిరత్నం డైరెక్టర్ తన దగ్గరున్న మూడు కథలతో ఏదో ఒక సినిమాను మళ్లీ వైజయంతీ మూవీస్ లోనే చేయబోతున్నాడని.. హీరోనే ఖాయం కావాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది.