తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులను కోల్పోతుంది. తాజాగా ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ గొంతు క్యాన్సర్ తో మరణించారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే మళ్లీ తీవ్రమైంది. బుధవారం పరిస్థతి విషమించడంతో కన్నుమూశారు. తెలుగు, తమిళంలో విజయాలు సాధించిన ఖుషి, 7/G బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. వీటితో మంచి గుర్తింపు వచ్చిన కోలా భాస్కర్ కుమారుడు బాలకృష్ణ కూడా చిత్రసీమలోనే ఉన్నారు. కోల భాస్కర్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.