తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,536 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,42,506 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,351గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,23,413 మంది కోలుకోగా ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,915 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. కాగా గత రోజులుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.