Homeబిజినెస్Toyota: టయోటా సంచలనం.. డీజిల్ లేకుండానే దూసుకుపోతుంది

Toyota: టయోటా సంచలనం.. డీజిల్ లేకుండానే దూసుకుపోతుంది

Toyota: ఇండియాలో టయోటా కార్లను ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టయోటా ఫార్చ్యూనర్‌ను మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ సిస్టమ్‌తో మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది పాపులర్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ లైనప్‌లో ఒక పెద్ద అప్‌డేట్. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. దీని ఉత్పత్తి ఇప్పటికే మొదలైంది. వచ్చే నెలలో దీనిని అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే కొత్త ఫార్చ్యూనర్ హైబ్రిడ్‌లో ప్రస్తుతం ఉన్న 2.8లీటర్ల ఫోర్-సిలిండర్ జీడీ సిరీస్ డీజిల్ ఇంజన్‌తో పాటు 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్ ఉంటుంది.

Also Read: జగన్ కు ముందే జిల్లాల పర్యటన.. షర్మిల స్కెచ్ అదే!

ఈ సెటప్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో సహా అనేక ఇంటర్నేషనల్ మార్కెట్లలో విక్రయించబడుతున్న ఫార్చ్యూనర్ MHEVని పోలి ఉంటుంది. అంతేకాకుండా టయోటా తన పవర్‌ఫుల్ హిలక్స్ పికప్‌ను కూడా కొన్ని సెలక్ట్ చేసిన దేశాల్లో మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో విక్రయిస్తోంది. ఫార్చ్యూనర్ 4×4 వేరియంట్‌లో మరోసారి ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ ఫీచర్ ఉంటుంది. ఈ మైల్డ్-హైబ్రిడ్ ఫంక్షన్‌ను మొదట 2021లో ప్రవేశపెట్టారు.. కానీ తర్వాత దశల్లో సైలెంట్ గా తమ లైనప్ నుండి తొలగించారు.

ఫార్చ్యూనర్ మైలేజ్ ఎంత?
కొత్త అవతార్‌లో తిరిగి రావడంతో దీని మైలేజ్ మెరుగుపడుతుందని అంతా భావిస్తున్నారు. అలాగే ట్రాఫిక్‌లో ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు, వేరియంట్ వివరాలు విడుదల అయినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ప్రస్తుతం ఫార్చ్యూనర్ డీజిల్ మోడల్ లీటరుకు 11 నుండి 14కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

కొత్త సిస్టమ్ ఎలా ఉంటుంది?
టయోటా కొత్త 48V మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌లో ఆల్టర్నేటర్‌కు బదులుగా బెల్ట్‌తో అనుసంధానించబడిన స్టార్టర్ జనరేటర్, ఒక 48వొల్లుల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, ఒక DC కన్వర్టర్ ఉంటాయి. టయోటా ప్రకారం.. ఈ సిస్టమ్ ఇంధన ఆదాను మెరుగుపరచడమే కాకుండా, పర్ఫామెన్స్ కూడా పెంచుతుంది. దీనితో పాటు టయోటా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను జోడించవచ్చు.

ఫార్చ్యూనర్ మైలేజ్ ఇంత పెరుగుతుందా?
ఫార్చ్యూనర్ హైబ్రిడ్‌లో 10 శాతం వరకు మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. అసలు విషయం ఏమిటంటే, కొత్త మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో ఆఫ్-రోడ్ సామర్థ్యం లేదా పవర్‌తో ఎటువంటి రాజీ ఉండదని టయోటా నొక్కి చెప్పింది. ఎస్‌యూవీ తన గుర్తింపును కాపాడటానికి 700 మిమీ వరకు నీటిలో నడిచే సామర్థ్యంతో సహా ముఖ్యమైన భాగాలను జాగ్రత్తగా ఉంచారు. టయోటా, మారుతి చేతులు కలిపిన తర్వాత ఇన్నోవా, అర్బన్ క్రూజర్‌లను హైబ్రిడ్ సిస్టమ్‌తో విడుదల చేశారు. ప్రస్తుతం మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కంపెనీ తన అత్యంత పాపులారిటీ పొందిన ఎస్‌యూవీతో కూడా అదే చేయబోతోంది.

Also Read: కొబ్బరి నీళ్లు, చెరుకు రసం మధ్య తేడా ఏంటి? రెండిటిలో ఏది బెటర్?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version