Tata Motors DVR Shares Update: టాటా షేర్ల కేటాయింపులో కీలక ట్విస్ట్.. ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డు.. ఏం జరుగుతోంది?

టాటా గ్రూప్ కంపెనీ - టాటా మోటార్స్ డైరెక్టర్ల బోర్డు, TML సెక్యూరిటీస్ ట్రస్ట్‌కు కొత్త సాధారణ షేర్ల కేటాయింపును ఆమోదించింది. BSE అనలిటిక్స్ ప్రకారం, సెప్టెంబర్ 2 నాటికి, టాటా గ్రూప్ స్టాక్ గత మూడు నెలల్లో ఆరోగ్యకరమైన 23.73 శాతం పెరిగింది మరియు 232.96 శాతం లాభపడి తన వాటాదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.

Written By: Mahi, Updated On : September 2, 2024 2:10 pm

Tata Motors DVR Shares

Follow us on

Tata Motors DVR Shares Update: మనకు తెలిసినంత వరకు టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్ రెండు లిస్టెడ్ కంపెనీలే. ఒకే కంపెనీకి సంబంధించి 2 స్టాకులు విడివిడిగా లిస్టయి ఉన్నాయి. ఇందులో టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ కు ఓటింగ్ రైట్స్ ఉంటే.. టాటా మోటార్స్ డీవీఆర్ షేర్ హోల్డర్లకు ఓటింగ్ రైట్స్ ఉండవు. ఇది ఇన్వెస్టర్లకు పెద్దగా అవసరం లేదని విషయమే. అయినా డీవీఆర్ కూడా మంచి స్టాక్స్ నే కలిగి ఉంది. కానీ, టాటా మోటార్స్ డీవీఆర్ గత ఏడు సంవత్సరాలుగా డివిడెంట్ చెల్లించడం లేదు. దీనికి కారణం కంపెనీ నష్టాల్లో ఉండడమే. 2015-16 ఫైనాన్సియల్ ఇయర్ తర్వాత మొదటి సారి డివిడెంట్ చెల్లించాలని బోర్డు ఆమోదం తెలిపింది.  సెప్టెంబర్ 1న టీఎమ్ఎల్ సెక్యూరిటీస్ ట్రస్ట్ కు రూ. 2 ముఖ విలువ కలిగిన 35,59,52,028 (35.59 కోట్లు) కొత్త సాధారణ షేర్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఇది ఒక స్వతంత్ర, తిరుగులేని ప్రైవేట్ ట్రస్ట్, ఇందులో యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ లిమిటెడ్ ఒక స్వతంత్ర ట్రస్టీ, ఇది టాటా మోటార్స్ అర్హత కలిగిన ‘A’ సాధారణ వాటాదారుల తరఫున, ప్రయోజనం కోసం కొత్త సాధారణ వాటాలను కలిగి ఉంటుంది. టాటా మోటార్స్ డీవీఆర్ షేర్ల మార్పిడి నిష్పత్తిని 10:7 గా నిర్ణయించింది. ప్రతీ 10 ‘A’ సాధారణ షేర్లకు 7 కొత్త సాధారణ షేర్లను పూర్తిగా చెల్లించాయి. అర్హులైన వాటాదారులను నిర్ణయించేందుకు రికార్డు తేదీని సెప్టెంబర్ 1గా నిర్ణయించారు. ఈ కేటాయింపుల ఫలితంగా కంపెనీ పెయిడ్ అఫ్ ఆర్డినరీ షేర్ క్యాపిటల్ రూ. 6,64,97,94,561 నుంచి రూ. 2 చొప్పున 3,32,46,58,528 ఆర్డినరీ షేర్లుగా విడిపోయి రూ. 7,36,16,98,617కు పెరిగింది. కొత్త సాధారణ షేర్లు కంపెనీ ప్రస్తుత సాధారణ షేర్లతో అన్ని అంశాల్లో స్థానం కల్పిస్తాయని టాటా మోటార్స్ ఆదివారం (సెప్టెంబర్ 1) తెలిపింది.

మూలధన తగ్గింపు పథకంలో.. కొత్త షేర్ల రూపంలో పంపిణీ చేసిన వాటాదారులకు కూడబెట్టిన లాభాల పంపిణీగా పరిగణిస్తారు. భారత ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 2(22)(డీ) ప్రకారం.. రికార్డు తేదీ నాటికి కూడబెట్టిన లాభాలు వాటాదారుల చేతుల్లో డివిడెండ్ గా పరిగణిస్తారు, వర్తించే పన్ను రేట్ల వద్ద (వ్యక్తులకు స్లాబ్ రేట్లతో సహా) పన్ను పరిధిలోకి వస్తాయి. ఇది కూడా టీడీఎస్ పరిధిలోకి వస్తుంది.

డీవీఆర్ షేర్లపై సాధారణ వాటాలను పొందుతున్న వాటాదారులకు 3 రకాల పన్నులు వర్తిస్తాయి. ముందుగా డీమ్డ్ డివిడెండ్ పై టీడీఎస్ ను వాటాదారుల తరఫున టీఎంఎల్ సెక్యూరిటీస్ ట్రస్ట్ చెల్లిస్తుంది. సెప్టెంబర్ 1, 2024 తర్వాత టీ+15 రోజుల్లో షేర్ హోల్డర్లకు కేటాయించిన సాధారణ షేర్లను విక్రయించడం ద్వారా ట్రస్ట్ ఈ టీడీఎస్ చెల్లిస్తుంది.

టీఎంఎల్ సెక్యూరిటీస్ ట్రస్ట్ జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా షేర్ హోల్డర్లు తమ ఐటీఆర్ లో టీడీఎస్ ను తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. టీఎంఎల్ సెక్యూరిటీస్ ట్రస్ట్ షేర్ల విక్రయానికి ఎస్ టీసీజీని కూడా చెల్లిస్తుంది. టీడీఎస్ చెల్లించిన తర్వాత నికర పరిమాణాన్ని వాటాదారులకు కేటాయిస్తారు. చివరగా, డీవీఆర్ కు వ్యతిరేకంగా సాధారణ షేర్లను స్వీకరించే వాటాదారుల ద్వారా ఎల్టీసీజీ చెల్లిస్తారని దేవన్ చోక్సీ డీఆర్ఓక్సీ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక నోట్ లో పేర్కొంది.