Samsung Galaxy A35: పండుగలు, ప్రత్యేక దినాల్లో కొన్ని వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా దసరా, దీపావళితోపాటు సంక్రాంతి సందర్భంగా కొన్ని మొబైల్స్ను తక్కువ ధరకే అందిస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి సేల్స్ ని పెంచుకునేందుకు కంపెనీలు సాధారణ రోజుల్లో కూడా తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా Samsung కంపెనీ తక్కువ ధరకే మొబైల్ అందించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీకి చెందిన Galaxy A 35 అనే మొబైల్ పై ఏకంగా రూ.13,500 తగ్గింపును ప్రకటించారు. దీంతో ఈ మొబైల్ ను రూ.19,000 లకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Samsung Galaxy A35 ప్రస్తుతం రూ.32,999 ధరతో విక్రయిస్తున్నారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ Flipkart లేటెస్ట్ గా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.Galaxy A35 కొత్త మొబైల్ కొనుగోలు చేస్తే రూ.19,999 లోపు దక్కించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ ను ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో పర్చేస్ చేస్తే అదనంగా రూ.1,000 తగ్గుతుంది. పాత మొబైల్ ఉంటే దానిని ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింతగా తగ్గి రూ.15,950 కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఒకేసారి మొత్తం చెల్లించలేని వారు కూడా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.3,334 చెల్లిస్తూ నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ A 35 మొబైల్ కు ఇప్పటికే ఆదరణ పెరిగింది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే ఉండనుంది. ఈ డిస్ప్లే 1900 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ లో Qualcomm స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉండగా..12 GB రామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో కెమెరా పని తీరు నాణ్యంగా ఉంటుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 5 MP మైక్రో లైన్స్ త్రిబుల్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీతో పాటు, వీడియో కాలింగ్ కోసం 12 ఎంపీ కెమెరా పనిచేయనుంది.
రోజువారి వినియోగదారులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులు మొబైల్ పై వర్క్ చేసేవారు దీనిని ఎంచుకోవచ్చు అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా రూ.20,000 లోపు మొబైల్ కొనాలని చూసేవారికి ఇదే మంచి అవకాశం అని అంటున్నారు. గతంలో ఎక్కువ ధరలో ఉన్న ఈ మొబైల్ ను కొనలేని వారు ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
