spot_img
Homeబిజినెస్Digital Payments: 12 ఏళ్లు.. 90 రెట్లు.. డిజిటల్‌ లావాదేవీల్లో మనమే తోపు!

Digital Payments: 12 ఏళ్లు.. 90 రెట్లు.. డిజిటల్‌ లావాదేవీల్లో మనమే తోపు!

Digital Payments: డిజిటల్‌ ఇండియా గడిచిన పదేళ్లుగా మోదీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న పదం ఇదీ. భారత్‌లో అన్ని కార్యకలాపాలను డిజిటల్‌ చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2016లో పెద్దనోట్లు రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో డిజిటల్‌ లావదేవీలవైపు ప్రజల దృష్టిని మళ్లించింది. ఇందులో గడిచిన పదేళ్లలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

భారీగా పెరుగుదల..
గడిచిన 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. ముంబైలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యలయంలో డిజిల్‌ చెల్లింపులపై నిర్వహించిన అవగాహన సదస్సులో కీలక విషయాలు వెల్లడించారు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ.162 కోట్ల రిటైల్‌ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరగ్గా.. 2023–24 నాటికి ఆ సంఖ్య రూ.14,726 కోట్లకు పెరిగిందని తెలిపారు. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని వివరించారు.

ప్రపంచంలో మనమే..
ఇక ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీల్లో 46 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని అని శక్తికాంతదాస్‌ తెలిపారు. యూపీఐ అనేది భారత్‌లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందన్నారు. భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయమైన వృద్ధికి యూపీఐలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. 80 శాతం వాటా యూపీఐలదే అని పేర్కొన్నారు.

యూపీఐ లావాదేవీలు ఇలా..
ఇక యూపీఐ లావాదేవీల విషయానికి వస్తే 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అవి 2023 నాటికి ఏకంగా 11,761 కోట్లకు పెరిగాయని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు సగటుల 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. చిరు వ్యాపారుల వరకూ యూపీఐ లావాదేవీలు చేరాయని వెల్లడించారు. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రతీ పల్లెలో డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నట్లు వివరించారు.

భవిష్యత్‌ అంతా డిజిటల్‌దే..
ఇక పెరుగుతున్న డిజిటల్‌ లావాదేవీలు భవిష్యత్‌ అంతా వాటిదే అని నిర్ధారిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. ప్రపంచంలో ఒకప్పుడు డిజిటల్‌ లావాదేవీల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుతం భారత్‌ 40 శాతం వాటా సాధించడం గర్వకారణమని తెలిపారు. అక్షరాస్యత పెరుగుదల, ఇంటర్నెట్‌ సదుపాయం, నగదు పెరుగుదల వంటి అంశాలు కూడా డిజిటల్‌ లావాదేవీలకు ఊతమిస్తున్నట్లు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper