Stock market : కల్లోలం నుంచి తేరుకున్న ఆదానీ.. నేడు 10 షేర్లు పెరిగాయి, హిండెన్ బర్గ్ ఒట్టి గాలి బుడగేనా?

సోమవారం స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల మధ్య అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల షేర్లు క్షీణించగా, మంగళవారం (ఆగస్ట్ 13) అన్ని స్టాక్స్ బూమ్ తో గ్రీన్ మార్క్ పై ప్రారంభమయ్యాయి.

Written By: NARESH, Updated On : ఆగస్ట్ 13, 2024 4:20 సా.

Stock Market

Follow us on

Stock market : భారత షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులను సృష్టించేందుకు అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ పన్నిన పన్నాగం వీడినట్లు కనిపిస్తోంది. అదానీ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్ పర్సన్ మధాబీ పూరి బుచ్‌కు వాటాలు ఉన్నాయన్న సంచలన విషయాలను హిండెన్‌బర్గ్ వివరించింది. కానీ ఇటు బుచ్, అటు అదానీ ఈ నివేదికను ఖండించారు. అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదికపై భారత స్టాక్ మార్కెట్ సోమవారం (ఆగస్ట్ 12) స్వల్ప ప్రభావాన్ని చూపింది, దీని కారణంగా రోజంతా గందరగోళం నెలకొంది. బలమైన పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు అకస్మాత్తుగా వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మార్కెట్ ముగిసే సమయానికి ఈ బూమ్ మళ్లీ పతనంగా మారింది. ఇది ఇలా ఉండగా.. భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి. అయితే మంగళవారం, అదానీ గ్రూప్ లోని అన్ని కంపెనీల షేర్లు బూమ్ తో గ్రీన్ మార్క్ పై ప్రారంభమయ్యాయి. ఒకవైపు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 55.42 పాయింట్లు నష్టపోయి 79,593.50 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 0.70 పాయింట్లు క్షీణించి 24,346.30 వద్ద ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభంతో 1711 షేర్లు లాభపడగా, 693 షేర్లు క్షీణించాయి. శనివారం (ఆగస్ట్ 10) హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది, ఇది మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధాబీ పూరి బుచ్ గురించి.

ఈ సారి కూడా అమెరికన్ షార్ట్ సెల్లర్ ఈ నివేదికలో గౌతమ్ అదానీ గురించి ప్రస్తావించింది. దీని ప్రభావం సోమవారం అదానీ స్టాక్స్ పై విపరీతంగా కనిపించడంతో ప్రారంభ ట్రేడింగ్ లో అన్ని స్టాక్స్ రెడ్ (నష్టాల్లో) మార్క్ పై ట్రేడయ్యాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి వాటిలో కొన్ని రివర్స్ గా మారి గ్రీన్ (లాభాల్లోకి) జోన్ లోకి ప్రవేశించగా, మంగళవారం గౌతమ్ అదానీ నేతృత్వంలోని స్టాక్ మార్కెట్ లో లిస్టయిన అన్ని కంపెనీల షేర్లు జోరును చూస్తున్నాయి.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను పరిశీలిస్తే, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు మంగళవారం అత్యంత బుల్లిష్ ఊపుతో ప్రారంభమై 4.12% పెరిగింది. ఇది కాకుండా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ (0.60%), అదానీ పోర్ట్స్ షేర్ (0.58%), అదానీ విల్మార్ స్టాక్ 1.51% లాభంతో ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీల విషయానికొస్తే అదానీ గ్రీన్ 1.58%, అదానీ టోటల్ గ్యాస్ 2.45%, అదానీ పవర్ 1.37%, అంబుజా సిమెంట్స్ 0.071%, ఏసీసీ లిమిటెడ్ 1.39%, ఎన్డీటీవీ 2.07% లాభపడ్డాయి.

అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు గ్రీన్ (లాభాల్లోనే) మార్కు పైనే ప్రారంభమయ్యాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, దిబిస్ ల్యాబ్స్, ఎల్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు పడిపోయాయి.

అమెరికా ఎన్ని అడ్డగోలు ఆరోపణలు చేసినా.. ఆదానీ లాంటి వారికి ఏమీ కాదని ఆయన ఇన్వెస్టర్లు అంటున్నారు. ఇలాంటి ఆరోపణలు గతంలో చాలా విన్నామని, కానీ ఏవీ ప్రూవ్ కాలేదని వారు అన్నారు. అదానీ షేర్లు లాభపడడంతో కొంతలో కొంత ఆనందానికి లోనయ్యారు ఇన్వెస్టర్లు..