Homeబిజినెస్Motorola latest smartphones: ఈ మొబైల్స్ ను క్యూ కట్టి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో...

Motorola latest smartphones: ఈ మొబైల్స్ ను క్యూ కట్టి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో ఏమున్నాయి? ఇవి ఎవరికీ ఉపయోగం?

Motorola latest smartphones: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తుంటాయి. కానీ ఫోన్ వినియోగదారులు కొన్నిటిని మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కొందరు బడ్జెట్ గురించి ఆలోచిస్తే.. మరికొందరు ఇందులో ఉండే ఫీచర్స్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. ఇంకొందరు బ్యాటరీ సామర్థ్యం బాగుండాలని అనుకుంటారు. అయితే ఇవన్నీ కలగలిపి ఒకే ఫోన్లో ఉండే అవకాశం లేదా? అంటే కచ్చితంగా ఉందంటూ Motorola కంపెనీ నిరూపిస్తుంది అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మోటరోలా కంపెనీ నుంచి వచ్చే మొబైల్స్ లో అద్భుతమైన ఫీచర్స్ తో పాటు, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా ఉందంటూ తెలుపుతున్నారు. అందుకే ఈ మొబైల్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మొబైల్ కంపెనీ భారత్ లో ఎలాంటి అభివృద్ధి సాధిస్తుందో ఇప్పుడు చూద్దాం..

మోటరోలా కంపెనీ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ మార్కెట్ షేర్ ధర 2025 లో ఆరు శాతానికి చేరి 135% గ్రోత్ తో రికార్డ్ సాధించింది. 2023 చివరిలో 2.7 నుంచి 2025లో ఆరు శాతానికి పెరగడం విశేషం. 2026 చివరి సంవత్సరం వరకు 10 శాతం మార్కెట్ షేర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా టాప్ 3 బ్రాండ్స్ లో మోటోరోలా మొబైల్స్ ఉండాలని టార్గెట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రీమియం మోడల్స్ విభాగంలో ఈ కంపెనీ 60 శాతం రెవెన్యూ పొందుతుంది. అయితే మోటరోలా కంపెనీకి సామ్సంగ్, వివో, షావోమి కంపెనీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇవి కూడా మోటరోలా ఫోన్ తరహా లోనే ఉండడంతో చాలామంది వాటిపై ఆసక్తి చూపుతున్నారు. కానీ మోటరోలా మొబైల్స్ లో ఉండే కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో వీటిపైనే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మోటోరోలా కంపెనీకి చెందిన అన్ని మొబైల్స్ లో షాప్ డ్రాగన్ మీడియాటిక్ డైమెన్సిటీ చిప్ సెట్ అమరుస్తారు. అలాగే ఇందులో సామర్థ్యాన్ని బట్టి ర్యామ్, స్టోరేజ్ ని అందిస్తారు. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసేవారు ఈ ఫోన్స్ ను ఎక్కువగా పెంచుకుంటారు. ఇందులో భాగంగా మోటరోలా G67 మొబైల్ వంటి వాటిని రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కూడా ఎక్కువగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ లో 5000 mAh నుంచి 7000 mAh వరకు ఫ్యాక్టరీ సామర్థ్యం ఉంటాయి. దీంతో గంటలపాటు మొబైల్ వినియోగించే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఈ బ్యాటరీ లు గరిష్టంగా 68 W ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తాయి. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావడానికి ఈ చార్జర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొబైల్స్ లో కెమెరా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దాదాపు అన్ని రకాల మొబైల్స్ లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇవి AI ఫీచర్లతో ఉండటంవల్ల చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. ఇక ధర విషయంలోనూ ఈ కంపెనీకి చెందినవి అందుబాటు. రూ.12,000 నుంచి రూ.35,000 వరకు ఉండడంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ మొబైల్ పై ఆసక్తి చూపుతుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper