Homeబిజినెస్Middle-class Budget mobiles: రూ.20 వేల లోపు అడ్వాన్స్ టెక్నాలజీ అందించే అద్భుతమైన ఫోన్లు...

Middle-class Budget mobiles: రూ.20 వేల లోపు అడ్వాన్స్ టెక్నాలజీ అందించే అద్భుతమైన ఫోన్లు ఇవే..

Middle-class Budget mobiles: ఉద్యోగులు, వ్యాపారులతోపాటు గృహిణులకు మొబైల్ అవసరం తప్పనిసరిగా మారింది. గతంలో కంటే ఇప్పుడు మొబైల్ తో చాలా రకాల పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యాలయ పనులు సైతం మొబైల్ ద్వారానే చేయగలుగుతున్నారు. అయితే చాలామంది బడ్జెట్లోనే మొబైల్ కొనాలని చూస్తుంటారు. స్మార్ట్ ఫోన్ రూ.15,000 నుంచి లక్షల రూపాయల ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. కానీ మెట్ మిడ్ రేంజ్ పీపుల్స్ రూ.25,000 లోపు మొబైల్ కొనాలని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం మార్కెట్లో ప్రస్తుతం రూ, 20,000 ధరతోపాటు అద్భుతమైన ఫీచర్లు ఉండే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ మొబైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

కొంతమంది అత్యధిక ధర చెల్లించి మొబైల్స్ కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ధరను బట్టి ఫీచర్స్ మారుతాయి. అయితే కొన్ని కంపెనీలు పోటీపడి తక్కువ ధరకే ప్రీమియం మొబైల్ కు సమానంగా ఫీచర్స్ ను అందిస్తున్నాయి. అలాంటి కంపెనీలో రియల్ మీ, మోటో, ఒప్పో వంటివి ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఫీచర్స్ ను ఉంచి తక్కువ ధరకే మొబైల్స్ ను అందిస్తున్నాయి. వాటిలో..

Realme Nargo 90 5G ఒకటి. ఈ మొబైల్ లో 6.57 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండరు ఉంది. అలాగే ఇందులో 6400 మ్యాక్స్ మీడియా టెక్ dimensity ప్రాసెసర్ ను అందిస్తుంది. ఇందులో 6 జిబి రామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ కరెంట్ కెమెరాతో ఏఐ ఫోటోలు అందించే ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని మార్కెట్లో రూ.13,999 నుంచి రూ.16,999 వరకు విక్రయిస్తున్నారు.

Realme Narzo 90x5G అనే మరో మొబైల్ కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ అందుబాటులో ఉంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 60 వాట్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది.50 MP సోనీ IMX 852 మెయిన్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాలు అమర్చారు. ఈ మొబైల్ 6.8 అంగుళాల ఎల్సిడి డిస్ప్లేన్ కలిగి ఉంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ నువ్వు పని చేస్తుంది. ఈ మొబైల్ కూడా రూ.13,999 నుంచి రూ.16,999 వరకు విక్రయిస్తున్నారు.

Moto G57 పవర్ 5జి అనే మొబైల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6s జెన్ 4 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చగా..8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 MP సెల్ఫీ కెమెరాలను అమర్చారు. ఈ మొబైల్ మార్కెట్లో రూ. 14,999 గా ఉంది.

మరో కంపెనీ OPPO కంపెనీ సైతం 6.7 అంగుళాల Amoled డిస్ప్లేను అందించే K13 5G మొబైల్లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 7000 mAh వేటవితో పనిచేస్తూ ఫుల్ చార్జింగ్ కేవలం 52 నిమిషాల్లోనే పూర్తయ్యే విధంగా సెట్ చేశారు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 MP సెకండరీ కెమెరాతో పనిచేసే దీనిని రూ.19,999 ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version