Homeబిజినెస్PhonePe Wrong Transfer: ఫోన్ పే, గూగుల్ పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా?...

PhonePe Wrong Transfer: ఫోన్ పే, గూగుల్ పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి

PhonePe Wrong Transfer: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయింది. ఏ పని చేయాలన్న ఆన్ లైన్ లోనే చేస్తున్నాం.. ముఖ్యంగా మనీ ట్రాన్జాక్షన్ అయితే పూర్తిగా మొబైల్ ద్వారానే పంపిస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే తొందరలో లేదా నిర్లక్ష్యంతో కొన్నిసార్లు తప్పు మొబైల్ నంబర్ లేదా UPI ఐడీకి డబ్బులు పంపే ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకుంటే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదెలాగో చూద్దాం..

అనుకోకుండా లేదా పొరపాటున డబ్బు పంపిన వెంటనే ఆ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ తేదీ, సమయం, పంపిన మొత్తం, లబ్ధిదారుడి వివరాలు వంటి సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసుకుని భద్రపరచాలి. ఫిర్యాదు చేసే సమయంలో ఈ వివరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలి. ట్రాన్సాక్షన్ వివరాలను అందించి డబ్బు పొరపాటున వేరే ఖాతాకు వెళ్లిందని తెలియజేయాలి. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత రిఫరెన్స్ నంబర్‌ను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.

ఏ యాప్ ద్వారా డబ్బు పంపారో ఆ యాప్ కు సంబంధించిన వారికి మెసేజ్ తెలియజేయాలి. వీటిలో గూగుల్ పే 1800 419 0157, ఫోన్‌పే: 080-68727374 / 022-68727374, BHIM: 1800 120 1740, Paytm: 0120-4456456 కాల్ చేసి వివరాలు అందించాలి. యాప్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే NPCI (National Payments Corporation of India) పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in వెబ్‌సైట్‌లో యూపీఐ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్ నమోదు చేస్తే సంబంధిత బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థల ద్వారా సమస్యను పరిశీలించే అవకాశం ఉంటుంది.

అవసరమైతే మీ బ్యాంకు కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్‌ను కూడా సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేయాలి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ పెండింగ్‌లో ఉన్నా లేదా సాంకేతిక లోపం కారణంగా సమస్య ఏర్పడినా బ్యాంకు సహాయం ఉపయోగపడుతుంది.

అయితే ముందుగానే యూపీఐ ద్వారా డబ్బు పంపే ముందు గ్రహీత పేరు, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్, మొత్తం వంటి వివరాలను రెండుసార్లు పరిశీలించడం మంచిది. కేవలం మొబైల్ నంబర్ ఆధారంగా కాకుండా స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుడి పేరును నిర్ధారించుకున్న తర్వాతే పిన్ నమోదు చేయాలి. ఇలా చేస్తే పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు వెళ్లే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version