Homeబిజినెస్Mercedes-Benz : జూన్ 1 నుంచి కస్టమర్ల జేబుకు చిల్లు.. రూ.12లక్షలు పెరగనున్న లగ్జరీ కార్ల...

Mercedes-Benz : జూన్ 1 నుంచి కస్టమర్ల జేబుకు చిల్లు.. రూ.12లక్షలు పెరగనున్న లగ్జరీ కార్ల ధర

Mercedes-Benz : త్వరలో కస్టమర్ల జేబుకు బెంజ్ కంపెనీ చిల్లు పెట్టనుంది. మెర్సిడెస్-బెంజ్ తమ కార్లన్నింటి ధరలను 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ ధరల పెంపును రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశ జూన్ 1 నుంచి, రెండవ దశ సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. రెండు దశల్లో ధరలను పెంచడానికి గల ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులపై పడే భారాన్ని తగ్గించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఈ ధరల పెరుగుదల రూ.90,000 నుంచి రూ.12.2లక్షల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది.

Also Read : మెర్సిడెస్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి.. ధర, ఫీచర్స్ కేక.. 560 కిలోమీటర్ల రేంజ్..

మెర్సిడెస్-బెంజ్ కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయంలో స్వల్ప భాగాన్ని మాత్రమే వినియోగదారులపై వేస్తున్నట్లు తెలిపారు. సి-క్లాస్ ధరలో కనిష్టంగా రూ.90,000 పెరుగుదల ఉండగా, ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.60.3 లక్షలు. మరోవైపు, మెర్సిడెస్-మేబాక్ ఎస్-క్లాస్ ధర గరిష్టంగా రూ.12.2 లక్షలు పెరగనుంది. దీంతో దీని కొత్త ధర రూ.3.60 కోట్లు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద వర్తిస్తాయి.

ధరల పెంపునకు ఇతర కారణాలు
మెర్సిడెస్ తెలిపిన ప్రకారం.. ఇప్పటివరకు పెరుగుతున్న వ్యయాలను భరించినప్పటికీ మెయింటెనెన్స్ ఖర్చులను తిరిగి రాబట్టడానికి, వ్యాపారాన్ని స్థిరంగా ఉంచడానికి ధరలను పెంచవలసి వస్తోందని తెలిపింది. ఈ సంవత్సరం జనవరి నుంచి విదేశీ మారకపు రేట్లలో భారీ పెరుగుదల కారణంగా ధరల సవరణ చేయవలసి వచ్చిందని ఆటోమేకర్ పేర్కొంది. ఇది విడిభాగాలు, ఉత్పత్తులు, ముఖ్యంగా పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడళ్ల వ్యయ నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

రెండుసార్లు పెంచడం వల్ల కలిగే ప్రయోజనం
రెండు దశల్లో ధరలను పెంచడం గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది వినియోగదారులకు వారి కొనుగోలు ప్రణాళికలను రూపొందించడానికి, వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఆర్థిక ప్రణాళికను చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది. GLC, GLC SUV వంటి మోడళ్ల కోసం ఈఎంఐ వ్యత్యాసం రూ.2,000 కంటే తక్కువగా ఉంటుందని మెర్సిడెస్-బెంజ్ కంపెనీ పేర్కొంది.

Also Read : భారత్ లో అమ్ముడయ్యే టాప్ లగ్జరీ కార్ బ్రాండ్లు ఇవీ

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version