Homeబిజినెస్Maruti Suzuki Flex Fuel Car: జూన్ 5న సంచలనం.. Maruthi Suzuki ప్రత్యేక కారు...

Maruti Suzuki Flex Fuel Car: జూన్ 5న సంచలనం.. Maruthi Suzuki ప్రత్యేక కారు ఆవిష్కరణ.. వివరాలు ఇవే..

Maruti Suzuki Flex Fuel Car: Maruthi Suzuki భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవంగా రాబోతున్న ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును జూన్ 5 2026న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ (World Environment Day) సందర్భంగా ఆవిష్కరించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏ మోడల్ అన్నది అధికారికంగా ప్రకటించకపోయినా, ‘వాగన్ ఆర్’ (Wagon R) లేదా ‘ఫ్రాంక్స్’ (Fronx) ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు వివరాల్లోకి వెళితె..

ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే ఏమిటి?
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్ తో పాటు, ఇథనాల్ (Ethanol) మిశ్రమంతో లేదా 100 శాతం ఇథనాల్‌తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇథనాల్ శాతం ఆధారంగా వీటిని E20, E85, E100 అని పిలుస్తారు. రాబోయే మారుతి కారు 100 శాతం ఇథనాల్‌ (E100) తో నడిచేలా రూపొందించబడింది. ఇది మన దేశంలోని బయో-ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడానికి మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక గొప్ప అడుగు.

ప్రత్యేక ఇంజన్ సాంకేతికత
ఇథనాల్‌కు తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది, ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్లలో తుప్పు పట్టడానికి దారితీయవచ్చు. అందుకే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూయల్ సిస్టమ్స్, యాంటీ-రస్ట్ ఇంజన్ కాంపోనెంట్స్ , మార్పులు చేసిన ఇంజన్ ట్యూనింగ్‌ను అమర్చారు. దీనివల్ల ఎక్కువ ఇథనాల్‌ను కూడా ఇంజిన్ సమర్థవంతంగా భరిస్తుంది.

ప్రయోజనాలు మరియు ఆర్థిక అంశాలు
ఈ వాహనాల ద్వారా భారతదేశం తన ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు ప్రస్తుతం మన అవసరాల్లో 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం . ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రారంభ దశలో, సాంకేతిక మార్పుల కారణంగా ఒక్కో వాహనంపై సుమారు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు అదనపు వ్యయం ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.

ప్రస్తుతానికి ఇటువంటి వాహనాల వినియోగం క్రమంగా పెరగనుంది. దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపిణీ చేసే పెట్రోల్ బంకుల నెట్‌వర్క్ విస్తరించడంపై ఈ కార్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఇథనాల్ ఆధారిత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి, సాధారణ వాహనాలతో సమాన స్థాయికి చేరుకుంటుందని మారుతి సుజుకి అధికారులు భావిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version