spot_img
Homeబిజినెస్Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము రెట్టింపు అవుతుంది. అయితే ఇటువంటి ఆలోచన చాలామందికి రాదు. ఒకవేళ వచ్చినా సరే సక్రమమైన విధానాలలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఇతడు మాత్రం చాలా భిన్నంగా ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు.. పెట్టుబడిని చాలా వినూత్నంగా పెట్టాడు. ఫలితంగా లక్షల నుంచి వందల కోట్లకు ఎదిగాడు. ఇప్పుడు ఇతడి గురించే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

లక్షలు పెట్టుబడి పెట్టి.. ఏకంగా వందల కోట్లకు ఎదిగిన ఆ వ్యక్తి పేరు జితేంద్ర. ఈయన బాలీవుడ్లో సీనియర్ నటుడు. 1970, 80 కాలంలో ఇతడు అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అప్పట్లోనే ఆయనకు తిరుగులేని స్టార్ డం ఉన్నప్పటికీ.. అది ఏ క్షణమైనా సరే ఫేడ్ అవుట్ అవుతుందని ఆయనకు తెలుసు. అందువల్లే ముంబై మహానగర అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి.. ఆయన పాలి హిల్ అనే ప్రాంతంలో దాదాపు 3450 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణమున్న బంగ్లాన్ని కొనుగోలు చేశాడు. నాడు దీనికి ఆయన 4.25 లక్షలు ఖర్చు పెట్టాడు. అప్పట్లో ఈ స్థాయిలో ఆయన డబ్బు పెడుతున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. జితేంద్రకు ఏమైనా పిచ్చా అనుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.

పాలీ హిల్ ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే ఆయన కొనుగోలు చేసిన బంగ్లా ప్రాపర్టీ కూల్చేసి.. కొత్తది కడుతున్నప్పుడు.. పాత ఫర్నిచర్ అమ్ముతూనే దాదాపు 11.5 లక్షలు వచ్చాయి. అంతేకాదు ఇప్పుడు ఆ ప్రాపర్టీ విలువ ఏకంగా 450 కోట్లకు చేరుకుంది.. జితేంద్ర చేతుల్లో సినిమాలు లేనప్పుడు.. అవకాశాలు అంతగా లభించినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక దశలో ఆ బంగారు అమ్మాలని అనుకున్నప్పటికీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చివరికి అదే సంకల్పంతో నిలబడ్డారు. అందువల్లే ఆ ప్రాపర్టీ ఈరోజుకు కూడా ఆయనకు ఒక కామ ధేనువు లాగా ఉంది. అందుకే బాలీవుడ్ సర్కిల్స్లో జితేంద్ర గురించి ఇప్పటికి గొప్పగానే చెప్పుకుంటారు. ఎందుకంటే పైసా పెట్టుబడి పెడితే ఈ స్థాయిలో లాభాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా భూమి అనేది బంగారం. దానిని సరేనా సమయంలో పెడితే అది అంతకు మించిన బంగారం.

పాలి హిల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన తర్వాత.. అనేక ప్రాంతాలలో కూడా జితేంద్ర భూములు కొన్నారు. కాకపోతే పాలీహిల్ ప్రాంతంలో వచ్చినంత స్థాయిలో అక్కడ లాభాలు రాలేదు. కొన్ని సందర్భాలలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆయన మిగతా ప్రాంతాలలో భూములు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ పాలిహిల్ ప్రాంతం మీద ఆయనకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉండడంతో ఆ భవనాన్ని అలాగే ఉంచుకున్నారు. అందువల్లే అవి ఏకంగా 450 కోట్ల విలువకు చేరుకుంది. పెట్టుబడి అనేది సరైన సమయంలో పెట్టాలి. సరైన ప్రాంతంలో పెట్టాలి. అప్పుడే మనం పెట్టిన పెట్టుబడికి సార్ధకత.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Oktelugu Epaper