spot_img
Homeబిజినెస్Croma Offers: యాపిల్ ఫోన్ కావాలనుకునే వారు వెంటనే త్వరపడండి.. జనవరి 26 వరకే..

Croma Offers: యాపిల్ ఫోన్ కావాలనుకునే వారు వెంటనే త్వరపడండి.. జనవరి 26 వరకే..

Croma Offers: 2026 కొత్త సంవత్సరం సందర్భంగా చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేశారు. అయితే వచ్చే రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ప్రత్యేకమైన వస్తువులను సొంతం చేసుకోవాలని అనుకుంటారు. దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రముఖ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. వాటిలో భాగంగా Croma అనే కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపును ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు ఉన్న స్టోర్లలో ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని అధికారికంగా ప్రకటించింది. జనవరి 26 వరకు మాత్రమే ఉండే ఈ ఆఫర్లలో ఐఫోన్ కూడా ఉండడం విశేషం. మరి ఏ వస్తువుపై ఎంత ధర తగ్గింపు ఉందో ఇప్పుడు చూద్దాం..

ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని అనుకునే వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రోమా కంపెనీ భారీ ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ సంస్థ నుంచి ఆపిల్ ఫోన్ కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపును ఇవ్వనుంది. ఐఫోన్ 15 మార్కెట్లో రూ.59,900 విక్రయిస్తున్నారు. దీనిపై రూ.23,500 ఎక్స్చేంజి ఆఫర్ ను. అలాగే రూ.2,000 ఫ్లాట్ బ్యాంకు క్యాష్ బ్యాక్, అదనంగా రూ.8,000 ఎక్స్చేంజి బోనస్ ఇవ్వనుంది. మొత్తంగా ఈ మొబైల్ ను రూ.31,990 కె విక్రయించే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి మరిన్ని ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఒకేసారి మొత్తాన్ని చెల్లించకుండా EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి పది శాతం వరకు తగ్గింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.

క్రోమా సంస్థ కేవలం ఆపిల్ ఫోన్ లపై మాత్రమే కాకుండా మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లపై కూడా తగ్గింపు ధరలు ప్రకటించింది. వీటిలో భాగంగా Samsung కంపెనీకి చెందిన గెలాక్సీ S24 మొబైల్ ను రూ.50,499 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే S 24 అల్ట్రా మొబైల్ రూ.79,999 కు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా నాకు బుక్ ఎయిర్ M4 రూ.55,911 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా క్యాష్బూక్ వర్తించే అవకాశం ఉంది. ఇవే కాకుండా గృహోపకరణాలు, వినోదానికి సంబంధించిన ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయి. సాంసంగ్ నియో QLED 65 అంగుళాల టీవీని రూ.1,75,000 నుంచి రూ.98,990 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అలాగే TCL 55 అంగుళాల QLED టీవీ రూమ్.38,990 తగ్గింపు తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు రూ.31,289 కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా మరిన్ని పరికరాలను, వస్తువులను భారీ ఆఫర్లతో విక్రయిస్తున్నట్లు క్రోమా సంస్థ ప్రకటించింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper