Homeబిజినెస్Amrit Mahotsav App Innovation Challenge 2021: తీపికబురు చెప్పిన కేంద్రం.. రూ.25 లక్షలు పొందే...

Amrit Mahotsav App Innovation Challenge 2021: తీపికబురు చెప్పిన కేంద్రం.. రూ.25 లక్షలు పొందే ఛాన్స్!

Amrit Mahotsav App Innovation Challenge 2021కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ ఒక కొత్త కాంటెస్ట్ ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ద్వారా భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీని పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ కాంటెస్ట్ లో పాల్గొంటారో వాళ్లు ఏకంగా 25 లక్షల రూపాయలు పొందవచ్చు. అమృతో మహోత్సవ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఎవరైతే ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో విన్ అవుతారో వాళ్లు 25 లక్షల రూపాయలు బహుమతిగా పొందే అవకాశం ఉంటుంది. అయితే తొలి విజేత మాత్రమే ఈ ఫ్రైజ్ మనీని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రెండో విజేత 15 లక్షల రూపాయలు, మూడో విజేత 10 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు యాప్స్ ను రూపొందించాల్సి ఉంటుంది. న్యూస్, గేమ్స్, ఫిన్‌టెక్, నావిగేషన్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, అగ్రికల్చర్, సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ను రూపొందించవచ్చు.

మొత్తం 16 కేటగిరీలు ఉండగా ఈ కేటగిరీలలో ఉత్తమ ప్రమాణాలతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాప్స్ ను రూపొందిస్తే మంచిది. సెప్టెంబర్ 30వ తేదీ ఈ కాంటెస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ కాంటెస్ట్ కు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్‌లో మొత్తం రెండు స్టేజ్ లు ఉండగా అర్హత కలిగిన ఎంట్రీస్‌కు మాత్రమే మొదట స్క్రీనింగ్ ఉంటుంది.

రెండో దశలో జ్యూరీ ఎంపిక, డెమో ఉంటుంది. మన దేశానికి చెందిన వాళ్లు మాత్రమే ఈ పోటీకి అర్హులు. అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కాంటెస్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version