spot_img
Homeబిజినెస్Gautam Adani: గౌతమ్ అదానికి అమెరికాలో షాక్.. ఏకంగా అరెస్టు చేయడానికి వారెంట్ జారీ.. ఇంతకీ...

Gautam Adani: గౌతమ్ అదానికి అమెరికాలో షాక్.. ఏకంగా అరెస్టు చేయడానికి వారెంట్ జారీ.. ఇంతకీ ఏం జరిగిందంటే

Gautam Adani: సౌర విద్యుత్తు తయారీ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో వీరంతా కూడా అడ్డదారులు తొక్కారని.. 20 సంవత్సరాలలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాలను పొందడానికి దొడ్డి దారిన వెళ్లారని.. భారత ప్రభుత్వం అధికారులకు ఏకంగా 265 మిలియన్ డాలర్లు లంచాలుగా చెల్లించారనే అభియోగాలు తెరపైకి వచ్చాయి.. అంతేకాదు అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాలలో. అప్పులు తీసుకొచ్చారని.. పెట్టుబడులు సేకరించారని న్యూయార్క్ అధికారులు తాము మోపిన అభియోగాలలో పేర్కొన్నారు. మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలను, ఇతర బాండ్లను అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ లోకి అక్రమంగా సేకరించారని న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపారు. ” భారతదేశపు అతిపెద్ద సౌర విద్యుత్ తయారీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలుగా చెల్లించడానికి అంగీకరించారు. ఈ పథకంలో బాగానే గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నారని” న్యూయార్క్ అధికారులు పేర్కొంటున్నారు.

ఏమిటీ కేసు

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ సౌరశక్తి ద్వారా విద్యుత్ తయారు చేయడానికి ముందుకు వచ్చింది. మరో కంపెనీతో కలిసి ఈ కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించింది. సుమారు 12 గిగావాట్ల సౌర శక్తిని భారత ప్రభుత్వానికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. ఇది లక్షలాది ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్ ను సరఫరా చేస్తుంది.. అయితే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారు భారత అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలుగా ఇచ్చారని న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపారు.. భారీగా ఇంధన సరఫరా ఒప్పందాలను పొందడానికి వారు ఈ అడ్డదారులతోక్కారని న్యూయార్క్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ పేర్కొన్నారు.. అదానీ గ్రూప్ పై కేసులు బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో దాఖలయ్యాయి. గౌతమ్ అదానితోపాటు అతడి మేనల్లుడు సాగర్ అదాని, మరో ఏడుగురుపై కేసు నమోదు అయింది. ఇందులో కంపెనీ సీఈవోగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వినీత్ జైన్ కూడా ఉపయోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై అదాని గ్రూపు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి న్యూయార్క్ అధికారులు అదాని గ్రూప్, ఆ కంపెనీకి సంబంధించిన న్యాయవాదులకు తాము మోపిన అభియోగాలను మెయిల్స్ ద్వారా పంపించారు.. అయితే దీనిని అదాని తరపు న్యాయవాది సీన్ హెకర్ తోసిపుచ్చారు. తమకు అలాంటి ఈ మెయిల్స్ రాలేదని ప్రకటించారు. కాగా, బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్తల జాబితాలో గౌతమ్ అదాని 19వ స్థానంలో ఉన్నారు. ఆయన కంపెనీల విలువ 85.5 బిలియన్ డాలర్లు. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదాని తన సంపదను క్రమంగా కోల్పోతున్నారు. 2022 నుంచి ఆయన నికర ఆస్తుల విలువ తగ్గిపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version