Gold and Silver price today: బంగారం, వెండి ధరలు వారం రోజులుగా పతనం అవుతున్నాయి. ఒకవైపు గల్ఫ్ యుద్ధం కారణంగా ఒకవైపు రూపాయి విలువ పతనం అవుతోంది. మరోవైపు బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రూపాయి పతనం అయితే బంగారం విలువ పెరగాలి. కానీ తగ్గుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.47 లక్షల నుంచి రూ.1.55 లక్షల మధ్య ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర ఒకదశలో రూ.3 లక్షలు దాటింది. కానీ ప్రస్తుతం రూ.2.35 లక్షలుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ.2.15 లక్షలకు పతనమైంది. ఈ హెచ్చుతగ్గులు రిటైల్ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా మారాయి.
ఫెడ్ రేట్ స్థిరీకరణ ప్రభావం..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరీకరించడం బంగారం మార్కెట్పై ప్రధానంగా ఒత్తిడికి కారణం. ఈ నిర్ణయం డాలర్ బలోపేతానికి దారితీసి, బంగారం వంటి సేఫ్–హేవెన్ ఆస్తుల ఆకర్షణ తగ్గింది. ఇన్వెస్టర్లు బాండ్లు, స్టాక్స్ వైపు మళ్లారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై లాంటి మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
సప్లయ్ పెరగడంతో..
చేతిలో డబ్బులు లేకపోవంతో ఇప్పటికే బంగారంపై పెట్టుబడి పెట్టినవారు ఇప్పుడు అమ్మేస్తున్నారు. దీంతో మార్కెట్లో సప్లయ్ పెరిగింది. ఫలితంగా ధరలు తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలు ఆసక్తిని తగ్గించింది. ఫలితంగా ధరలు మరింత పతనమవుతున్నాయి. ఈ విక్రయాలు ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ తర్వాత పెరిగాయి.
రికవరీ సూచనలు
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు బంగారానికి మద్దతుగా నిలుస్తాయని నిపుణులు అంచనా. వెండి మార్కెట్ ఇండస్ట్రియల్ డిమాండ్తో (సోలార్, ఎలక్ట్రానిక్స్) బలపడవచ్చు. అయితే, ఫెడ్ తదుపరి చర్యలు, భారత జీడీపీ గ్రోత్ కీలకం.
డబ్బులు సమృద్ధిగా ఉన్నవారు ఈ తక్కువ ధరలను అవకాశంగా చూసి కొనుగోలు చేయవచ్చు. దీర్ఘకాల లాభాల కోసం. అప్పులు చేసి రిస్క్ పెంచుకోవద్దు. ఇప్పుడు కొంటే రాబోయే రోజుల్లో ధర మళ్లీ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
