Azad Engineering Share: సచిన్ టెండుల్కర్ ఈ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టి.. 6 నెలల్లోనే రెట్టింపు సంపాదించాడు!

గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం (జూలై 12) స్టాక్ మార్కెట్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ షేరు బలమైన పెరుగుదలను నమోదు చేసింది. రోజూ ట్రేడింగ్ సమయంలో ఇది 5 శాతం పెరిగింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి, ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు 2.59 శాతం పెరిగి రూ.1741 వద్ద ముగిసింది. ఇంతలో, ఈ డిఫెన్స్ షేర్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే రూ. 1781.90 స్థాయికి పెరిగింది.

Written By: Neelambaram, Updated On : July 14, 2024 1:58 pm

Azad Engineering Share

Follow us on

Azad Engineering Share: రక్షణ రంగ దిగ్గజం ‘ఆజాద్ ఇంజినీరింగ్’ షేర్లు తమ ఇన్వెస్టర్లకు తక్కువ సమయంలో మల్టీ బ్యాగర్ స్టాక్‌లుగా నిరూపించుకున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ వ్యాపారానికి సంబంధించిన ఈ కంపెనీ షేర్లు ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు 150 శాతానికి పైగా రాబడిని అందించాయి. వాటి మొత్తాన్ని రెండున్నర రెట్లు పెంచాయి.

గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం (జూలై 12) స్టాక్ మార్కెట్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ షేరు బలమైన పెరుగుదలను నమోదు చేసింది. రోజూ ట్రేడింగ్ సమయంలో ఇది 5 శాతం పెరిగింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి, ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు 2.59 శాతం పెరిగి రూ.1741 వద్ద ముగిసింది. ఇంతలో, ఈ డిఫెన్స్ షేర్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే రూ. 1781.90 స్థాయికి పెరిగింది.

ఈ డిఫెన్స్
కంపెనీ షేర్లు దీర్ఘకాలంలోనే కాకుండా స్వల్పకాలంలో కూడా తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తున్నాయి. షేర్ల పెరుగుదల ప్రభావం కంపెనీ మార్కెట్ క్యాప్‌పై కూడా కనిపించి రూ.10280 కోట్ల స్థాయికి చేరుకుంది. కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2080 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.640 కావడం గమనార్హం. గత వారం చివరి ట్రేడింగ్ రోజు ఈ స్టాక్ ఊపందుకున్నప్పటికీ, వారమంతా దాని వేగం నెమ్మదిగానే ఉంది. ఆరు నెలల పనితీరు ఇన్వెస్టర్లను మెప్పించేలా ఉంది.

6 నెలల్లో రూ. 1055 పెరిగిన షేర్ ధర
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ షేర్లలో 154.09 శాతం రాబడిని దక్కించుకుంది. దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం కంపెనీ షేర్లలో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కలిగి ఉంటే అది దాదాపు రూ.2.5 లక్షలకు పెరిగి ఉండేది. వాస్తవానికి, 15 జనవరి, 2024న ఈ ఒక్క స్టాక్ ధర రూ. 685.20, అది ఇప్పుడు రూ. 1741గా మారింది. అంటే ఈ షేరు ధర రూ.1055.80 పెరిగింది.

ఎందుకు పెరిగాయంటే?
ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు ఒక్క సారిగా ఇంత వేగంగా ఎందుకు పెరిగాయి? ఆజాద్ ఇంజనీరింగ్ జర్మనీలోని సిమెన్స్ ఎనర్జీ గ్లోబల్ GmbH & Co. నుంచి పెద్ద ఆర్డర్‌ను ప్లేస్ చేసిందని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరించింది. ఈ ఆర్డర్ కింద ఐదేళ్లకు సంబంధించి అధునాతన భాగాలు, వాటి ప్రపంచ డిమాండ్ల మేరకు తయారు చేసి సరఫరా చేయాలి. ఈ పెద్ద ఆర్డర్‌ను ప్లేస్ చేసిందన్న వార్తల సానుకూల ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. దాని ప్రభావం సోమవారం మార్కెట్ పై ఎలా పడిందో చూడవచ్చు.

సచిన్ ఎంత పెట్టుబడి పెట్టారంటే?
క్రికెట్ ప్రపంచంలో మాస్టర్ బ్లాస్టర్‌గా గుర్తింపు దక్కించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ డిఫెన్స్ కంపెనీలో ఎంత పెట్టుబడి పెట్టారంటే? నివేదికల ప్రకారం.. అతను గతేడాది మార్చిలో ఇందులో దాదాపు రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుతో అతను కంపెనీకి చెందిన సుమారు 4 లక్షల షేర్లను కొనుగోలు చేశాడు.

6 నెలలు, సంవత్సరంలో స్టాక్ పెరుగుదల కారణంగా, సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో భారీ పెరుగుదల కనిపించింది. కంపెనీ తన IPOని డిసెంబర్, 2023లో ప్రారంభించిందని, దాని ధర బ్యాండ్ రూ. 594గా నిర్ణయించబడింది. అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయినప్పటి నుంచి, ఈ షేర్ ధర మూడు రెట్లు పెరిగింది.