Homeబిజినెస్Pm Kisan Yojan : ఈసారి అలా చేయకుండే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు...

Pm Kisan Yojan : ఈసారి అలా చేయకుండే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడవు.. ఏం చేయాలంటే?

Pm Kisan Yojan :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు ఇక నుంచి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. గత ఏడాదిగా దీనిపై ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం చేసింది. ఈ కేవైసీ చేసుకుంటనే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వస్తాయని తెలిసింది. అయినా చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ కైవేసీ చేసుకోలేదు. అయితే వారికి నేరుగా అవగాహన కల్పించేందుకు 2024 ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రైతులకు ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 పంట సాయం చేస్తుంది. 5 నెలలకు ఒకసారి రూ.2000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 15 విడతలు పూర్తి కాగా.. త్వరలో 16వ విడత కింద రూ.2000 సాయం చేయనుంది. ఈ తరుణంలో రైతులకు సంబంధించిన వివరాలు పక్కగా ఉండాలని, అందువల్ల రైతులు ఈ కేవైసీని చేయించుకోవాలని తెలిసింది. అయితే కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ సాగుతోంది. కానీ కొంత మంది రైతులకు అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదు.

దీంతో కొందరు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడడం లేదు. ఆఫ్ లైన్ లో వీలు కాకపోతే ఆన్ లైన్ ద్వారా ఈ కేవేసీ చేయుంచుకోవాలని తెలిపింది. అయినా ఇప్పటికీ దానిని పట్టించుకోవడం లేదు. ఈసారి మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని తెలుపుతోంది. లేకుంటే పీఎం కిసాన్ డబ్బులు రావని తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. కొంత మంది సిబ్బంది రైతుల నుంచివివరాలు సేకరించి ఈ కేవైసీ పూర్తి చేస్తారు.

చాలా మంది రైతులు తమ భూమి అయినా ఈ కేవైసీ పూర్తి కాకపోవడంతో తమ ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు రెవెన్యూ సిబ్బందిని ఈ విషయం అడగ్గా సరైన సమాధానం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version