ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ప్లాన్ లేనట్టే?

ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరలో కీలక మార్పులు చేస్తూ ఆ ప్లాన్ ధరను ఏకంగా 60 శాతం పెంచింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ 79 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు డబుల్ డేటాతో పాటు నాలుగు రెట్లు ఎక్కువగా అవుట్ గోయింగ్ మినిట్స్ ను పొందే అవకాశం అయితే […]

Written By: Navya, Updated On : July 29, 2021 11:51 am
Follow us on

ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరలో కీలక మార్పులు చేస్తూ ఆ ప్లాన్ ధరను ఏకంగా 60 శాతం పెంచింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ 79 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు డబుల్ డేటాతో పాటు నాలుగు రెట్లు ఎక్కువగా అవుట్ గోయింగ్ మినిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

ప్రస్తుతం కంపెనీ కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎంట్రీ లెవెల్ ప్లాన్ల వల్ల కస్టమర్లు తమ అకౌంట్ బ్యాలెన్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ఎయిర్ టెల్ చెబుతోంది. 2021 సంవత్సరం జులై 29వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయని సమాచారం. 79 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 64 రూపాయల టాక్ టైమ్ ను పొందవచ్చు.

ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 200 ఎంబీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీని పొందే అవకాశం ఉంటుంది. ఎయిర్ టెల్ తాజా నిర్ణయం ద్వారా ప్రతి వినియోగదారుడి సగటు ఆదాయాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ఎయిర్ టెల్ గత వారం పోస్ట్ పెయిడ్ ప్లాన్లను సైతం అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ నిర్ణయం వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

ఎయిర్ టెల్ బేసిక్ ప్లాన్ విషయంలో మార్పులు చేయడంతో ఇతర టెలీకాం కంపెనీలు సైతం ఆదాయం పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను సైతం గత వారం అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.