Homeబిజినెస్Nokia Lay off : మరోసారి 2000 మందికి ఉద్వాసన పలికిన నోకియా.. కారణం ఇదే...

Nokia Lay off : మరోసారి 2000 మందికి ఉద్వాసన పలికిన నోకియా.. కారణం ఇదే !

Nokia Lay off : టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపడం ద్వారా చాలా కంపెనీలు ఇప్పటికే తమ వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, కంపెనీ 2000 మందిని తొలగించింది (Jobs Cut). గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. ఖర్చులను తగ్గించుకోవడానికి యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. అయితే చైనా ఉద్యోగుల తొలగింపుపై మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. ఈ వారం ప్రారంభంలో మెటా లేఆఫ్ కూడా లేఆఫ్‌లు చేసింది. మెటా సంస్థ ఇప్పటికే రెండు దశల్లో వేలాది మందిని ఇంటికి పంపింది. తాజాగా మెటా ఫరీధిలో వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాల్టీ ల్యాబ్‌లలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, మెటా ఈ తొలగింపుల గురించి లేదా ఎంత మందిని తొలగించాలనుకుంటున్నారు అనే విషయాన్ని నిర్ధారించలేదు.

800 మిలియన్ యూరోలు ఆదా
నోకియా వార్షిక నివేదిక ప్రకారం.. గ్రేటర్ చైనాలో కంపెనీకి 10,400 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీకి యూరప్‌లో దాదాపు 37,400 మంది ఉద్యోగులు ఉన్నారు. నోకియా 2023లో 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 800 మిలియన్ యూరోలను ఆదా చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కంపెనీ 2026 నాటికి 1.2 బిలియన్ యూరోలను ఆదా చేయాలని యోచిస్తోంది.

చైనా నుంచి కంపెనీకి షాక్
నోకియా దృక్కోణంలో చైనా చాలా ముఖ్యమైన మార్కెట్. మరోవైపు హువావే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధిస్తోంది. దీని కారణంగా చైనా కంపెనీలు నోకియా మరియు ఎరిక్సన్ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. నోకియా 2019లో ఇచ్చిన సమాచారంలో తమ మొత్తం నికర అమ్మకాలలో 26 శాతం చైనా నుంచి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు అది 6 శాతానికి తగ్గింది.

నోకియా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
ఇటీవలే కంపెనీ క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఇచ్చిన సమాచారంలో, తమ నిర్వహణ లాభంలో 9 శాతం పెరుగుదల ఉందని చెప్పారు. అయితే, నికర అమ్మకాలు అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి.

సంక్షోభంలో ఐటీ
ఐటీ రంగం సంక్షోభంలో పడింది. వాళ్లు.. చెబుతున్నది కాదు.. గూగుల్ స్వయంగా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు.. ఉద్యోగులంతా ఇందుకు సిద్ధంగా ఉండాలని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ స్వయంగా ప్రకటించారు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, రెండవ రౌండ్‌లో 20,000 మంది ఉద్యోగులు Google నుండి తొలగించబడవచ్చని భావిస్తున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version