Bigg Boss OTT Telugu: తెలుగు ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ చేసేందుకు కు బిగ్ బాస్ ఓ టి టి లో వస్తున్న సంగతి తెలిసిందే. టెలివిజన్కు అయితే కొన్ని సెన్సార్ రూల్స్ ఉంటాయి కానీ ఓటు అలాంటివి ఏమీ ఉండకపోవడంతో మరింత బోర్డు కంటెంట్ను ఇచ్చేందుకు కంటెస్టెంట్స్ రెడీ అవుతున్నారు. అయితే మొదటి రోజు కొంచెం అటు ఇటు గా సాగినా.. రెండో రోజు నుంచి మాత్రం ఆటలు రసవత్తరంగా సాగుతున్నాయి.
బిగ్బాస్ అభిమానులు కోరుకున్నట్టుగానే సరికొత్త టాస్క్ లు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇక్కడే కొన్ని అభ్యంతరకర టాస్క్ లు కూడా తెరమీదకు రావడంతో విమర్శలు వస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో స్టిక్కర్లు అందించాలనే టాస్క్ మీద నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ గేమ్లో చాలెంజర్ కామ వారియర్స్ నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురు గేమ్ ఆడారు.
Also Read: నాయీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మోహన్ బాబు.. ఈసారి ఏమవుతుందో ?
ఇందులో అమ్మాయిల మీద అబ్బాయి లు తప్పుగా తాకే అవకాశం కూడా ఉంది. ఎక్కువ స్టిక్కర్లు అతికించి చాలనే తాపత్రయంలో కొంత బలంగా స్టిక్కర్లను అతికించే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఎలిమినేట్ నుంచి తప్పించుకోవాలంటే కెప్టెన్సీ కోసం ఇలా చేసే ఆస్కారం ఉంది. ఇక గేమ్ మధ్యలో బింధు మాధవి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసింది.
అఖిల్ కలగజేసుకోవడంతో.. నటరాజ్ మాస్టర్ వచ్చి తోలు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. బిగ్ బాస్లో టాస్క్ లు కంటెస్టెంట్స్ మధ్యలో చిచ్చు రేపేందుకు చేస్తున్నారిన తెలుస్తోంది. కానీ ఇవే హద్దులు మీరిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరి రెండో రోజునాడే ఇలాంటి టాస్క్ పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంతకు మించి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.
Also Read: భీమ్లానాయక్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్రమ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్లకు గురూజీ..!
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read More