చిత్తూరులో టీడీపీ నేతల గృహ నిర్బంధం

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై శుక్రవారం జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఆ పార్టీ ‘చలో తంబళ్లపల్లె’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా అంగుళ్లలో టీడీపీ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసులతో వాగ్వాదం దిగడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో తంబళ్ల పల్లె కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల టీడీపీ నాయకులు అక్కడికి చేరుతుండడంతో […]

Written By: Suresh, Updated On : December 12, 2020 10:48 am
Follow us on

చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై శుక్రవారం జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఆ పార్టీ ‘చలో తంబళ్లపల్లె’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా అంగుళ్లలో టీడీపీ నాయకులు నిరసన తెలపడంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో టీడీపీ నాయకులు, పోలీసులతో వాగ్వాదం దిగడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. చలో తంబళ్ల పల్లె కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల టీడీపీ నాయకులు అక్కడికి చేరుతుండడంతో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇటీవల తంబళ్ల పల్లె లో మ్రుతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం టీడీపీ నాయకులు వెళ్లడంతో వారిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇందుకు నిరసనగా నేడు ఆందోళన చేపడుతున్నారు.