జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు పవన్ విస్త్రుతంగా పర్యటిస్తున్ారు. ఇప్పటికే క్రుష్ణా, గుంటూరు , చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ నేడు శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. అయితే మరికాసేపట్లో పొయ్య గ్రామానికి చేరుకునున్న పవన్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తొట్టంబెడు మండలం పొయ్య గ్రామంలో వైసీపీ కార్యకర్తలను పవన్ ను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు పవన్ పర్యటిస్తున్నారు.