ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్య నిలిపివేత

విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యను నిలిపివేస్తున్నట్లు మాన్సాస్‌ ట్రస్టు పాలకవర్గం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంతకాలం నిర్వహించిన ఇంటర్‌ విద్యను మూసివేస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు […]

Written By: Suresh, Updated On : October 26, 2020 6:10 pm
Follow us on

విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యను నిలిపివేస్తున్నట్లు మాన్సాస్‌ ట్రస్టు పాలకవర్గం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాన్సాస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంతకాలం నిర్వహించిన ఇంటర్‌ విద్యను మూసివేస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారన్నారు.