విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ గోడలను మున్సిపల్ అధికారులు శనివారం ఉదయం నుంచి కూల్చుతున్నారు. రుషికొండ, ఎండాడలోని 40.51 ఎకరాల్లో యూనివర్సిటీ విస్తరించి ఉంది. ప్రభుత్వ భూమిలో ఈ వర్సిటీ నిర్మాణం జరిగిందనే ఆరోపణలతో యూనివర్సిటీలోని ప్రహారి గోడ, సెక్యూరిటీ గదులను కూల్చారు. అయితే యాజమాన్యం మాత్రం నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆందోలనను చోటుచేసుకోవచ్చనే ఉద్దేశంతో పోలీసులు భారీగా మోహరించారు.