ఇది రాజకీయ కక్షసాధింపు చర్యే..: చంద్రబాబు

విశాఖలో గీతం యూనివర్సిటీ కూల్చివేతపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థుల చదువులకు, యువత ఉపాధికి దోహదపడుతుందని ఆయన ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం కక్షసాధింపు చర్యేనని అన్నారు. మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం యూనివర్సిటీ కూల్చివేతల వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలున్నాయని ఆయన పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : October 24, 2020 2:41 pm
Follow us on

విశాఖలో గీతం యూనివర్సిటీ కూల్చివేతపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీ ఎంతో మంది విద్యార్థుల చదువులకు, యువత ఉపాధికి దోహదపడుతుందని ఆయన ట్విట్టర్‌ వేదికగా చెప్పారు. కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం కక్షసాధింపు చర్యేనని అన్నారు. మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం యూనివర్సిటీ కూల్చివేతల వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలున్నాయని ఆయన పేర్కొన్నారు.