https://oktelugu.com/

రేపు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశమై అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చపై దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో నివర్ తుఫాను, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు వివరించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి సాగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. మొత్తం […]

Written By: , Updated On : November 26, 2020 / 06:18 PM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశమై అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చపై దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో నివర్ తుఫాను, పంట నష్టం అంచనాలపై సీఎంకు మంత్రులు వివరించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి సాగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. మొత్తం ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరిగే నేపథ్యంలో 30న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.